E-Paper
Advertisement

KRMB: కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం.. సాగర్‌లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపు

KRMB: కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం..  సాగర్‌లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపు

KRMB Three Member Committee: వేసవి కాలంలో తాగు నీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చర్చించాయి. ఈ నీటి కేటాయింపులపై కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

నాగార్జున సాగర్ లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు ఈ కమిటీల కేటాయించింది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేఆర్‌ఎంబీ కమిటీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశంలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమీటీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మే నెలలో కేఆర్‌ఎంబీ మరోసారి ఈ కేటాయింపుల విషయంలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపులపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ జలశౌధలో నిర్వహించారు.

తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణకు అదనంగా 7 టీఎంసీల నీటిని వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ పేర్కొంది. సాగర్ నుంచి వెంటనే తమకు రావాల్సిన 5 టీఎంసీల నీటిని ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేసింది.

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×