BigTV English
Advertisement

KTR Admits BRS Fault | కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే ఓటమికి కారణం.. కేటీఆర్ అంగీకరించినట్లే!

KTR Admits BRS Fault | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని క్రమంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరిస్తున్నటలు తెలుస్తోంది. త్వరలో జరిగబోయే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయాలని ఆయన ఇటీవల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తాన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను బయటపెడుతున్నారు.

KTR Admits BRS Fault | కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే ఓటమికి కారణం.. కేటీఆర్ అంగీకరించినట్లే!
Political news in telangana

KTR Admits BRS Fault(Political news in telangana):


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని క్రమంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరిస్తున్నటలు తెలుస్తోంది. త్వరలో జరిగబోయే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయాలని ఆయన ఇటీవల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తాన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను బయటపెడుతున్నారు.

ఆ కారణాలలో ప్రథమంగా పార్టీ పేరుని టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్‌గా మార్చడమే జరిగిన పెద్ద తప్పు అని సీనియర్ నేత ఖానాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ద్వారా చెప్పించారు. ఈ పార్టీ పేరు మర్చే నిర్ణయం కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నది. అలాగే దళిత బంధు పథకంతో భారీ ఓట్లు దండుకోవచ్చని భావించినా.. దాని అమలులో సరిగా జరగలేదని చెప్పారు. ఈ పథకం ద్వారా కొందరు మత్రమే లాభపడ్డారు. చాలామంది దరఖాస్తుదారులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో వారందరూ అధికార బీఆర్ఎస్‌పై కోపంతో ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసినట్లు తెలిపారు.


అలాగే రైతు బంధు పథకం ఫలాలు వందల ఎకరాలున్న భూస్వాములకు, వ్యవసాయం చేయని బీడు భూముల యజమానులు పొందుతున్నారని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నా కేసీఆర్ సర్కార్ పెడచెవిన పెట్టాయి. ఇప్పుడు మాత్రం బడా భూస్వాములకు రైతు బంధు పథకం ఇవ్వడం తప్పేనని అంగీకరిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గంలోని సమస్యలు చెప్పుకుందామని ప్రయత్నిస్తే.. కేసీఆర్, కేటీఆర్ అందుబాటులో ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం కేటీఆర్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరితో కలుస్తూ ఉంటామని, తరచూ సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని చెబుతున్నారు.

తాము చేసిన తప్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒకవైపు అంగీకరిస్తూనే.. బీఆర్ఎస్ 39 సీట్లు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ కాదు మేమే గెలిచామని చెప్పుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. కేసీఆర్ సినిమా చూపిస్తారని బెదిరిస్తున్నారు. ఇలా చెప్పడం ఒక రకంగా అహంకారమే. ఈ అహంకారమే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అన్ని కారణాల కంటే అతి ముఖ్యమైనది. తమ తప్పులు తెలుసుకోవడమే కాదు వాటిని సరిదిద్దుకోవాలి. మరి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం.

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×