KTR Farmhouse: కేటీఆర్ ఫామ్ హౌస్ 311 ,301,313 సర్వే నంబర్ ప్రాంతంలో ఉందని, ఇప్పుడు ప్రదీప్ రెడ్డి నాదే అని బోర్డు పెట్టుకుండని ఎంపి చామల కిరన్ కుమార్ రెడ్డి అన్నారు. ఫిరంగి నాలని కవర్ చేసి ఫామ్ హౌస్ కట్టారు. కేటిఆర్ నా చిన్ననాటి మిత్రుడు అని ప్రదీప్ రెడ్డి అంటుండని అన్నారు. కేటిఆర్, ప్రదీప్ రెడ్డికి మధ్య ఎలాంటి లీజు అగ్రిమెంట్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.
ఫిరంగి నాలాను కవర్ చేసి కట్టారు కాబట్టే హైడ్రా నోటీసులు ఇచ్చిందని, జులై లో హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోటీస్ వచ్చిందని అన్నారు. ఇప్పటివరకు నోటీసులకు రిప్లై ఇవ్వలేదని, ఈ భూములను సత్యం రామలింగరాజుకు చెందినవని ఎంపీ చామల అన్నారు. ఇది సత్యం రామలింగరాజుకు సంబంధించి బినామీ సంస్థలని ఈడి, ఐటి అటాచ్ చేసుకుందని అన్నారు.
ఫామ్ హౌస్ 4 ఎకరాలు, మూడు ఎకరాలు 20 గుంటలు కేటీఆర్ సతీమణి అత్తగారి పేరు మీద ఉందని, శతభిషా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మీద ప్రాపర్టీస్ బినామీ 13 ఎకరాలు ఈడీ ఏటాచ్ చేసుకుందని తెలిపారు. D రాజేష్ పేరెడకు ట్రాన్స్ఫర్ చేశారు. D, రాజు సత్యం రామలింగరాజుకు అత్యంత సన్నిహితుడని అన్నారు. 301 లో కల్వకుంట్ల శైలిమ పేరు మీద 3.5 ఎకరాలు ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడికొస్తే టెర్రరిస్ట్ లాగ ఆయనను జైలుకు పంపారని గుర్తు చేశారు.
Also read: టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!
ఇక్కడ వివిపి జోనని ఎగరేసినందుకు రేవంత్ రెడ్డిని జైల్లో వేశారని, ప్రవెయిట్ ప్రాపర్టీకి లోపలికి రావాలని మాకు ఆవసరం లేదని ఎంపీ చామల అన్నారు. ప్రదీప్ రెడ్డి నాదే అంటున్న ఫామ్ హౌస్లో కేటీఆర్ ఉన్నది వాస్తవం కాదా, 111జీవో లో ఎటువంటి కట్టడం కట్టడానికి వీలు లేదని, శతభిషా లిమిటెడ్ 13 ఎకరాల భూమి ఎందుకు రిలీజ్ అయ్యిందని ప్రశ్నించారు.
ఈడీ అటాచ్ చేసిన భూములు రాజేష్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. రాజేష్ నుండి ప్రదీప్ రెడ్డికి రెడ్డికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయని ప్రశ్నించారు. మీరు హైకోర్టుకు అపిల్కు ఎందుకు పోలేదని అన్నారు. నిన్న హరీష్ రావు భాగోతాలు చూపించాము. ఈరోజు కేటీఆర్ బాగోతాలు చూపించామని ఫైర్ అయ్యారు. రేపు ఇంకొకరి బాగోతాలు చూపిస్తామని ఎంపి చామల క్లారిటీ ఇచ్చారు.
Also read: భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్పోర్టులో ఊహించని ట్విస్ట్!