BRS: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఓటమి తర్వాత ఆమె నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పాడు..
అయితే తెలంగాణలోని జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ ఏరియాలో ఉప ఎన్నిక జరిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్య మాగంటి సునీత గోపీనాథ్ను అభ్యర్థిగా బరిలోకి దింపింది.
సునీత గోపీనాథ్ ఇంతకుముందు రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి, కానీ ఆమె భర్త మరణం తర్వాత సెంటిమెంట్తో ఓట్లు బాగా పడతాయి.. మేమే గెలుస్తాం అనుకున్నారు. కానీ, ఒక్కసారిగా వారి ప్లాన్ రివర్స్ కొట్టింది. సునిత పై నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచాడు. దీంతో సునీత ఓటమిని అంగీకరిస్తూ, “పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగింది” అని ఆరోపించారు.
Also Read: వారెవ్వా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
అయితే నేడు కేటీఆర్ మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లారు. జూబ్లీహిల్స్లోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. అంతేకాకుండా కేటీఆర్ సునీతకు ధైర్యం చెప్పారు. “రాజకీయాల్లో విజయాలు, పరాజయాలు సహజం. మీరు, మీ పిల్లలు చూపిన ఉత్సాహం, పోరాటాన్ని అభినందిస్తున్నాను” అని అన్నారు. మొత్తంగా కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆమె ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన కేటీఆర్ pic.twitter.com/OLltso1vRF
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2025