E-Paper
Advertisement

Weather Report: కాక్‌టైల్ వెదర్.. ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్..

Weather Report: కాక్‌టైల్ వెదర్.. ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్..
Advertisement
weather report

Weather Report: గత కొన్ని రోజులుగా అటు భానుడి భగభగలు.. ఇటు అకాల వర్షాలతో అల్లాడిపోతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. గతంలో వరుసగా వానలు పడటంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం దొరికినట్లు అయ్యింది. ఈ వేసవిలో అకాల వ‌ర్షాల‌తో అప్పుడప్పుడు వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్లబ‌డింది. అయితే గురువారం నుంచి అస‌లు వేస‌వికాలం ప్రారంభం కానుందని వాతావరణశాఖ తెలిపింది. హైద‌రాబాద్ లో పొడి వాతావరణం ఏర్పడుతుందని.. దీని వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.

దాదాపు అన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది వాతావరణశాఖ. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు అటు ఇటుగా ఎండ ఉంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరగనున్నాయి. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవంతో జనాలు ఉక్కిరిబిక్కిరికానున్నారు. అలాగే ఈ రోజు నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

Advertisement

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నిన్న తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అది క్రమంగా బలపడుతూ రేపటికి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో ఒకట్రెండు చోట్ల తేలిక పాటి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయ ని గరిష్ట ఉష్ణోగ్రత 43డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకా శముందని వాతావరణశాఖ వెల్లడించింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×