BigTV English
Advertisement

Telangana Jobs Investments: తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రాష్ట్రంలో ఎల్‌ఈడీ తయారీ యూనిట్.. 6000 ఉద్యోగాలు!

Telangana Jobs Investments: తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రాష్ట్రంలో ఎల్‌ఈడీ తయారీ యూనిట్.. 6000 ఉద్యోగాలు!

Telangana Jobs Investments| ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. పిక్సియమ్ డిస్‌ప్లే టెక్నాలజీస్ కంపెనీ రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించనుంది. ఈ పరిశ్రమ రాష్ట్ర టెక్ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఎల్‌ఈడీలు, మైక్రో ఎల్‌ఈడీలు, ఆడియో-వీడియో భాగాలపై దృష్టి సారిస్తుంది. ఇది వేల ఉద్యోగాలను సృష్టిస్తుంది.


మొదటి దశ: ఫ్యాక్టరీ స్థాపన, ఉద్యోగాలు
మొదటి దశలో పిక్సియమ్ రూ.200-250 కోట్లు పెట్టుబడి చేస్తుంది. ఎల్‌ఈడీలు, మైక్రో ఎల్‌ఈడీలు, ఆడియో-వీడియో భాగాల తయారీ జరుగుతుంది. 1,000 మందికి పైగా నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. దాదాపు 5,000 మందికి పరోక్ష ఉపాధి ఉంటుంది. ఈ దశ త్వరలో ప్రారంభమవుతుంది.

రెండో దశ: విస్తరణ ప్రణాళిక
రెండో దశలో రూ.1,000 కోట్లు పెట్టుబడి చేస్తారు. ఈ విస్తరణ 5,000 నేరుగా ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఎగుమతులు మరింత ఊపందుకుంటాయి.


హైదరాబాద్ నుంచి ఎగుమతులు
పిక్సియమ్ భారతదేశంలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని సమాచారం. ఇక్కడ ఎల్‌ఈడీలు, మైక్రో ఎల్‌ఈడీలు తయారవుతాయి. ఈ ఉత్పత్తులు దేశీయ వినియోగంతో పాటు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. దీనివల్ల భారత్‌కు ఆర్థిక లాభం చేకూరుతుంది.

టెక్నాలజీ సహకారం
చైనాకు చెందిన ఏఈటీ ప్రో ఏవీ టెక్నాలజీ సహకారం అందిస్తుంది. ఈ భాగస్వామ్యం.. క్వాలిటీ ఉత్పత్తుల తయారు చేసేందుకు హామీ. ఉన్నత స్థాయి టెక్నాలజీ ప్రమాణాలు సాధ్యమవుతాయి.

మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం

ఈ పెట్టుబడుల గురించి పిక్సియమ్ డైరెక్టర్లు పేరం శరత్ బాబు, చరుకుపల్లి రాకేష్ రెడ్డి.. తెలంగాణ మంత్రి డి.శ్రీధర్ బాబుతో సమావేశం జరిపారు. ఈ మీటింగ్ లో ప్రశాంత్ శ్రీవాస్తవ కూడా హాజరయ్యారు. ఏఈటీ ప్రో డైరెక్టర్లు ‘సు పైవో కో’, ‘హాన్ కిట్ చాన్’ కూడా మంత్రిని కలిశారు. పరిశ్రమ స్థాపనపై సానుకూల చర్చలు జరిగాయి. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణలో అనుకూల వాతావరణం
మొదట గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్టుబడులకు ఆహ్వానించినా పిక్సియమ్ కంపెనీ తెలంగాణను ఎంచుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కీలకంగా మారింది. తెలంగాణలో పెట్టుబడికి అనుకూల వాతావరణం ఉండడంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు పిక్సియమ్ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో వాణిజ్య విధానాలను ప్రశంసలు కురిపించారు.

ఈ పెట్టుబడి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది. ఉద్యోగాలు, ఎగుమతులు పెరుగుతాయి. రాష్ట్రం డిస్‌ప్లే టెక్‌లో ముందంజలో నిలుస్తుంది.

Related News

TG Govt Schools: గురుకుల, కేజీబీవీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెండింగ్ బకాయిలు మొత్తం క్లియర్

Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Fee reimbursement Scheme: ఫీజు రియంబర్స్‌మెంట్ వివాదం.. నవంబర్ 3 నుంచి ప్రైవేటు కళాశాలల బంద్?

Chamala Kiran Kumar Reddy: అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర: ఎంపీ చామల

Heavy Rains: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం, రైతన్నలు జర జాగ్రత్త..!

Azharuddin Oath: రేపే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు, ఎందుకంటే?

Big Stories

×