BigTV English

Lizard In School Meal: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

ప్రభుత్వ స్కూల్ లో పిల్లలకు పెట్టిన భోజనంలో బల్లి పడడంతో 30 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ మెదక్ జిల్లాలోని రామయంపేటలో తెలంగాణ మాడల్ స్కూల్ లో గత వారం జరిగింది. మీడియాలో ఈ ఘటనపై కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

Lizard In School Meal: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

Lizard In School Meal| ప్రభుత్వ స్కూల్ లో పిల్లలకు పెట్టిన భోజనంలో బల్లి పడడంతో 30 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ మెదక్ జిల్లాలోని రామయంపేటలో తెలంగాణ మాడల్ స్కూల్ లో గత వారం జరిగింది. మీడియాలో ఈ ఘటనపై కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.


మెదక్ జిల్లా రామాయంపేట మాడల్ స్కూల్‌లో హాస్టల్ విద్యార్థులకు ఉదయం టిఫిన్‌లో ఉప్మా వడ్డించారు. ఆ ఉప్మాలో బల్లి పడడంతో ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఆ ఉప్మా తిన్న తరువాత.. 30 విద్యార్థులకు వాంతులయ్యాయి. ముగ్గరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం.. డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడుకేషన్ అండ్ లిటరసీ సీరియస్ అయింది. దీనిపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read: దారుణం.. ప్రేయసి తల్లిదండ్రులను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది


తెలంగాణ ప్రభుత్వం.. ఈ ఘటనపై స్పందిస్తూ.. స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకున్నామని చెప్పింది. ప్రభుత్వం పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ ద్వారా పీఎం పోషణ్ పథకం పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని పాఠశాలల్లో టిఫిన్ పథకం కూడా ప్రారంభించింది.

ఇటీవలే మధ్యప్రదేశ్ లో భారత సైన్యంలో ఉద్యోగం పొందేందుకు కోచింగ్ తీసుకుంటున్న వంద మంది విద్యార్థులు హాస్టల్ భోజనం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి అనారోగ్యం పాలయ్యారు. వీరిలో 30 మంది ఆస్పత్రిలో కూడా చేరారు. వీరంతా ఒకే కోచింగ్ ఇన్స్‌టిట్యూట్ లో శిక్షన పొందుతున్నారు. ఇలాగే మధ్యప్రదేశ్ ఇందోర్ లో శ్రీ యుగ్ పురుష్ ధామ్ బౌధిక్ వికాస్ కేంద్రలో అయిదు మంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయారు.

Also Read: ఎనిమిదేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు మైనర్లు!

ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం స్పదించింది. ప్రభుత్వ పాఠశాల్లో భోజన భద్రత కోసం చర్యలు తీసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

Tags

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×