ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా మాదాపూర్ గ్రామ సర్పంచ్ మాదరి శ్రీనివాస్ అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి పథంలో గ్రామాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే సంకల్పంతో ఆయన తాజాగా భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
గ్రామంలోని పేరోజీపల్లి ప్రాంతంలో సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ మాదరి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశానో.. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నానని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా గ్రామంలో మురుగునీటి సమస్య లేకుండా.. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొమ్మెర రవీందర్ రెడ్డి, కటకం తిరుపతి, మార్గం మల్లేశం పాల్గొన్నారు. వీరితో పాటు ఉప సర్పంచ్ కళ్లెం అనిత – మల్లారెడ్డి, వార్డు సభ్యులు మాడుగుల కరుణాకర్ రెడ్డి, గోవిందు సంతు, కత్తి శ్రీనివాస్, భూపెల్లి రమేష్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ను అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: Revanth Reddy: రైతులకు రేవంత్ రెడ్డి భరోసా.. ఎన్నికల తర్వాత రూ.9 వేల కోట్లు విడుదల..!