Train Accident: చిన్న తప్పుకి భారీ మూళ్యం చెల్లించాల్సివస్తుందిగా అన్నట్టుగా మహబూబాబాద్ జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. గేట్మెన్ నిర్లక్షానికి ఓ భారీ ప్రమాదం నుండి భయట పడ్డారు. వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుండి చర్లపల్లి వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళుకు భారీ ముప్పు తప్పినట్టైంది. జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె సమీపంలో ఈ ఘటన జరిగింది.
రైళ్వే అధికారి గేట్మెన్ నిర్లక్ష్యంతో గేట్ నెం.75 వద్ద రైళ్వే సిగ్నల్ వేయ లేదు. దీంతో పట్టాల మీదుగా ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. విధులులో భాగంగా గేట్ మెన్ రైళు వచ్చే సమయంలో సిగ్సల్ వేసి అటుమీదుగా వెల్లే వారిని ఆపివేసి రైళు వెల్లాక మల్లీ ఓపెన్ చేయాల్సిఉంటుంది. అయితే గేట్మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండి పోయాడు. దీంతో అక్కడ ఫుట్బ్యాక్ కావడంతో ముందుగానే గుర్తించిన రైళు నడిపే వ్యక్తి అప్రమత్తమై లోకో పైలట్ సడెన్ బ్రేక్ వేసి ప్రమాదాన్ని తప్పించాడు.
Also read; నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
అయితే ఒక్కసారిగా బ్రేక్ పడటంతో రైళులో ప్రయాణికులంతా భయాందోళనుకు గురై ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రయాణికులలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడారు. గేట్మెన్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని సస్పెండ్ చేస్తూ రైళ్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత పెద్ద ప్రమాదం తప్పడంతో రైళ్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also read: Singareni Mines: చరిత్రలోనే తొలిసారిగా సింగరేణి భారీ రికార్డు.. ఒకే సారి 5-స్టార్ రేటింగ్..?