E-Paper
Advertisement

Minister Uttam with Food Secretary Sanjeev: తెలంగాణ రోల్ మోడల్ కావాలి.. మంత్రి ఉత్తమ్‌తో కేంద్ర ఆహార శాఖ సెక్రటరీ భేటీ

Minister Uttam with Food Secretary Sanjeev: తెలంగాణ రోల్ మోడల్ కావాలి.. మంత్రి ఉత్తమ్‌తో కేంద్ర ఆహార శాఖ సెక్రటరీ భేటీ
Advertisement

Minister Uttam with Food Secretary Sanjeev: ధాన్యం, ప్రజా పంపిణీ విధానంలో తెలంగాణ రోల్ మోడల్ కావాలని ఆకాంక్షించారు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా. కొన్ని విషయాల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు బాగున్నాయని కితాబు ఇచ్చారు.

శుక్రవారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా, మంత్రి ఉత్తమ్ కుమార్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారాయన. ధాన్యం సేకరణ, మిల్లింగ్ విధానంలో తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు బాగుందన్నారు.

Advertisement

అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందన్నారు. వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ఉండాలన్నారు. ఏజీ కాలనీలో చౌక ధరల దుకాణాన్ని సందర్శించారాయన. ముఖ్యంగా బియ్యం, గోదుముల నాణ్యత పరిశీలించి రేషన్ డీలర్‌తో మాట్లాడారు.

అంతకు ముందు సివిల్ సప్లై కార్యాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. సంస్కరణల విషయంలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పుకొచ్చారు సంజీవ్ చోప్రా.

Advertisement

ALSO READ: హైదరాబాద్.. పార్కు చేసిన కారులో మంటలు, చేయించారా? అనుకోకుండా..

ఈ క్రమంలో కార్యదర్శి సంజీవ్ చోప్రా దృష్టికి కొన్ని అంశాలు తీసుకెళ్లారు మంత్రి ఉత్తమ్. ధాన్యం కొనుగోళ్లు విధానం, మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ, బకాయిదారుల ఆస్తులు సీజ్ చేయడం, వారికి ధాన్యం కేటాయింపు నిలిపివేయడం వాటిని వివరించారు. వాటిని క్షుణ్నంగా విన్న ఆయన, పరిశీలిస్తామని చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×