E-Paper
Advertisement

Malla Reddy : ప్రజాభవన్ వద్ద మల్లారెడ్డి బాధితుల ఆందోళన.. మాజీ మంత్రిపై కబ్జా ఆరోపణలు..

Malla Reddy : ప్రజాభవన్ వద్ద మల్లారెడ్డి బాధితుల ఆందోళన.. మాజీ మంత్రిపై కబ్జా ఆరోపణలు..

Malla Reddy : ప్రజాభవన్‌ వద్ద మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేపట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తమ భూములను మాజీ మంత్రి కబ్జా చేశారని ఆరోపించారు. తమకు 360 ప్లాట్లు ఉంటే అందులో.. 110ప్లాట్‌లను కబ్జా చేశారని అంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మల్లారెడ్డి పేదలకు నిలువు నీడ లేకుండా చేశారని బాధితులు మండిపడ్డారు. పేద ప్రజల పట్ల యముడిలా మారారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు బాధితులు. కబ్జా చేసిన భూములను తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వందమందికి పైగా మల్లారెడ్డి బాధితులు ఉన్నామన్నారు.

ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. మల్లారెడ్డి రౌడీలతో భయపెట్టారని బాధితులు ఆరోపించారు. భూములు కబ్జా చేసి ధరణిలో నమోదు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×