E-Paper
Advertisement

CM Chandrababu: 15 నెలల్లో 4.7 లక్షల ఉద్యోగాలు.. ఇది మా ఘనత: సీఎం చంద్రబాబు

CM Chandrababu: 15 నెలల్లో 4.7 లక్షల ఉద్యోగాలు.. ఇది మా ఘనత: సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉద్యోగ కల్పనపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 15 నెలల కాలంలో అన్ని రంగాలలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలను రంగాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో సీఎం వివరించారు.

అత్యధికంగా ప్రైవేట్ రంగంలో..

Advertisement

ప్రైవేట్ రంగంలో అత్యధికంగా 3,48,891 ఉద్యోగాలు కల్పించినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. ఇందులో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎస్‌ఎంఈ (MSME), పునరుత్పాదక విద్యుత్ వంటి రంగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 92,149 మందికి ఉద్యోగం వచ్చినట్టు చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9093 మంది ఉద్యోగం సాధించారని వివరించారు. పోలీసు శాఖలో 6100 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు..

Advertisement

ప్రైవేట్ రంగంలో: 3,48,891 మందికి ఉద్యోగాలు
జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్ మెంట్: 92,149 మందికి ఉద్యోగాలు
మెగా డీఎస్సీ: 15,941 మందికి ఉద్యోగాలు
వివిధ ప్రభుత్వ విభాగాలు: 9093 మందికి ఉద్యోగాలు
పోలీస్ శాఖలో: 6100 మందికి ఉద్యోగాలు
వర్క్ ఫ్రమ్ హోమ్: 5500 మందికి ఉద్యోగాలు

పొర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో..

మొత్తంగా.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఈ 15 నెలల పాలనలో సుమారు 4.7 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్టున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ ఉద్యోగి ఎక్కడ, ఎప్పుడు ఉద్యోగం పొందారనే పూర్తి వివరాలను ఒక పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కూడా ఆయన తెలిపారు.

ALSO READ: RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు

హైవేల నిర్మాణంలో ఏపీ రెండో స్థానం..

అంతేకాకుండా, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రూ. 6.23 లక్షల కోట్ల పెట్టుబడులకు 10 ఎస్ఐపీబీ (State Investment Promotion Board – SIPB)ల ద్వారా ఆమోదం లభించిందని, ఇది భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో హైవేల నిర్మాణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని, లక్షన్నర కోట్ల విలువైన జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు.

ALSO READ: Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×