BigTV English
Advertisement

Patancheru : భార్యను కాపురానికి పంపట్లేదని దారుణం.. అత్త హత్య.. అడ్డొచ్చిన భార్యపై ?

Patancheru : భార్యను కాపురానికి పంపట్లేదని దారుణం.. అత్త హత్య.. అడ్డొచ్చిన భార్యపై ?

Patancheru : ఇస్నాపూర్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను కాపురానికి పంపట్లేదన్న కోపంతో అత్తపై కత్తితో దాడి చేశాడు. దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన భార్యపై కూడా అదే కత్తితో దాడి చేసి.. గొంతు కోశాడు. ఈ సంఘటనలో అత్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.


పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లోని పద్మారావు కాలనీలో ఉండే శాంతమ్మ(40) తన కుమార్తె సత్యవతి(22)ని రుద్రవరానికి చెందిన సాయిబాబా (26)కు ఇచ్చి వివాహం జరిపించింది. ఇటీవల దంపతుల మధ్య గొడవలు కావడంతో సత్యవతి పుట్టింటికి వెళ్లింది. రోజులు గడుస్తున్నా సత్యవతి తిరిగి కాపురానికి రాలేదు. తన భార్య సత్యవతిని అమె తల్లి శాంతమ్మే కాపురానికి పంపడం లేదని సాయిబాబా కోపం పెంచుకున్నాడు. భార్యకోసం అత్తగారింటికి వెళ్లినట్లే వెళ్లి.. శాంతమ్మను కత్తితో పొడిచి చంపాడు. అడ్డొచ్చిన భార్య గొంతు కోశాడు.

అనంతరం సాయిబాబా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న సత్యవతిని, అమె తల్లి శాంతమ్మను స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శాంతమ్మ మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం సత్యవతికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Big Stories

×