E-Paper
Advertisement

BRS : బీఆర్ఎస్‌లో మారీచ సుబాహులు.. వీరి గురువు ఎవరంటే?

BRS : బీఆర్ఎస్‌లో మారీచ సుబాహులు.. వీరి గురువు ఎవరంటే?

మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్ ఇప్పటికే పురపోరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రతిపక్షాలు సైతం మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించాయి.వచ్చే వారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటరు జాబితా.. రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ ఎన్నికల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు సైతం ఎన్నికల్లో ఏం చేయాల్సిన పనులపై ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తున్నది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం.

రాక్షసుల్లా అడ్డుతగులున్నారు..

ముందుగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనికి రాక్షసుల వలే బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదిలాబాద్ సభలో నిర్వహించిన ‘ప్రజాపాలన, ప్రగతి బాట’ సభలో తీవ్ర విమర్శలు చేశారు. గతంలో రాక్షసులు ఉండేవారని వారి పేరు మారీచుడు, సుబాహు అని.. ప్రస్తుతం వారు అసెంబ్లీలో ప్రభుత్వానికి అడ్డం పడుతున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావులను ఉద్దేశించి విమర్శించారు. వీరి గురువు శుక్రాచార్యుడు ఉండేవారని.. ఆయన ప్రస్తుతం ఫాంహౌస్‌లో పడుకున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రతిపనికి అడ్డంకులే…

ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నారని.. మంచి పనికి సలహాలు, సూచనలు ఇవ్వాలని.. ప్రతిదానికి అడ్డుపడితే అభివృద్ధి ఎలా ముందుకు సాగుతుందని సీఎం ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీని ప్రారంభించినప్పుడు రియల్ ఎస్టేట్ కోసమే భూములు పొగేస్తున్నారని అలా విమర్శించారని.. హిల్ట్ పాలసీ విషయంలోనూ అదే రిపీట్ చేశారని అధికార పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును గత పదేండ్లు పడావు పెట్టిన గత పాలకులు.. ఇప్పుడు తమ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రాక్ష్లసులు మాత్రమే ఇలా ప్రతిపనికి అడ్డు పడతారని.. మిగతా వారు ఎవరూ ఇలా చేయరని ఫైర్ అవుతున్నారు.

Naralokesh : పబ్లిసిటీ వద్దంటున్న మంత్రి నారా లోకేష్.. షాక్ అవ్వాల్సిందే!

విమర్శలకేనా ప్రతిపక్షం..

రాజకీయాల్లో అధికారం అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఐదేండ్లు పాలన సరిగా ఉంటే ప్రజలు మరోసారి అధికారపార్టీకి చాన్స్ ఇస్తారు. అదే నచ్చకపోతే వారిని దించేసి ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. చరిత్ర మొత్తం ఇదే సీన్ రిపీట్..అలాంటిది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద విరుచుకపడటం, వారి సలహాలు సూచనలు తీసుకోకుండా నియంత పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రస్తుతం అధికారానికి దూరమయ్యాక ప్రస్తుత ప్రభుత్వానికి పేరు రాకుండా చేయాలనుకోవడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలు, సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఏమైనా చెడు జరుగుతున్నదంటే ప్రతిపక్షాలు పోరాటం చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలకు అన్యాయం జరగకుండా అడ్డుగోడలా నిలబడాలి. కానీ, మంచి చేసినా అడ్డుతగలడం అనే నియమాన్ని ప్రతిపక్షం పాటించడం సహించరానిదని.. ఇలాంటి సమయంలో వారిని రాక్షసులతోనే పోల్చాల్సి ఉంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇదిలాఉండగా, తమ నేతలను రాక్షసులు అని సీఎం రేవంత్ సంభోదించడాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్న రేవంత్ సర్కార్.. ప్రశ్నిస్తే దూషించడం, అణిచివేయడం చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×