E-Paper
Advertisement

ఇక నైనా రైతులు మేల్కోనక పోతే సర్వ వినాశనమే: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్!

ఇక నైనా రైతులు మేల్కోనక పోతే సర్వ వినాశనమే: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్!
Advertisement

Oil Palm: స్వేచ్ఛ బ్యూరో: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాయ గార్డెన్ లో ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, అధ్యక్షతన నిర్వహించిన ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెరుగుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన సదస్సు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ , వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు రైతులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ,రాష్ట్ర గేయాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భవిష్యత్తులో భూమి మొత్తం..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని అన్ని రకాల సబ్సిడీలు ఆర్థిక, ఆధునిక సాంకేతిక రంగంలో నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా రైతులకు మేలు చేసే విధంగా
అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అన్నారు. రైతులు ప్రయత్నం చేయక పొతే భవిష్యత్తులో భూమి మొత్తం నిస్థార మవుతుందని,తక్కువ పెట్టుబడి తో ఎక్కువ పంటలు పండించేలా రైతులు ముందుకెళ్లాలని, ఆర్గానిక్ పంటల సాగు పై రైతులు ద్రుష్టి పెట్టాలన్నారు. భూములను రక్షించి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పై అవగాహనా కలిపించు కోవాలన్నారు.

ఆయిల్ ఫామ్ పంటలో..

Advertisement

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఓకే పంట కాకుండా పంటల మార్పిడి చేయాలన్నారు. ఒకే పంటతో జరిగిన నష్టాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు. పండ్లు కూరగాయలు పూలులతో ఆయిల్ పామ్ పంటలను కూడా పండించడం ద్వారా అధిక లాభాలను అర్జించవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటలో ఇతర పంటలను కూడా పండించవచ్చని, కోతుల బెడద నుండి పంటలను కాపాడడానికి ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Also Read: మిత్ర‌ధ‌ర్మం పాటించి.. విజ‌య్ ఆఫ‌ర్ కాద‌ని! త‌మిళ‌నాడు కాంగ్రెస్‌లో చ‌ర్చ‌…!

అంతర్ పంటలు..

Advertisement

మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ రైతుల బాగు కోరి ఆయిల్ ఫామ్ పంటను రాష్ట్ర ప్రభుత్వం పరిచయం చేసిందన్నారు ఈ పరిచయం దినదినాభివృద్ధి చెందుతూ. మన జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు అన్నారు. రైతులు ప్రస్తుతం ఉన్న పంటలే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపుతూ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు అంతర్ పంటలు వేస్తూ ఆయిల్ ఫామ్ సాగు చేస్తే లాభాలు బేశరతుగా ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇతర పంటలపై..

మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ప్రత్యామ్నాయ ఇతర పంటలపై రైతులు మొగ్గు చూపుతూ సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జించాలని తెలిపారు. అంతకుముందు శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, కౌన్సిలర్లూ తదితరులు పాల్గొన్నారు.

Also Read: రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల మాయాజాలం.. అక్కడ లంచం ఇస్తేనే లైసెన్స్..!

Related News

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

Big Stories

Advertisement
×