E-Paper
Advertisement

Ex gratia Cheques: యువ శాస్త్రవేత్త అశ్వినీ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత

Ex gratia Cheques: యువ శాస్త్రవేత్త అశ్వినీ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత
Advertisement

Ex gratia Cheques to Young Scientist Ashwini Family: భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ లతో కలిసి బుధవారం అందజేశారు. కారేపల్లి మండలం గంగారాం తండాకు చెందిన మోతీలాల్, ఆయన కుమార్తె యువ శాస్త్రవేత్త అశ్వినీ వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయి మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయల చొప్పున రు. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, పత్రాన్ని అందజేశారు.

Also Read: బ్రేకింగ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

Advertisement

అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అశ్వినీ మరణంతో దేశం, ప్రపంచం ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోయిందని అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోతీలాల్, అశ్విని చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. వరదల్లో కొట్టుకుపోయి మృతిచెందిన యువ శాస్త్రవేత్త కుటుంబానికి రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్ తోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.

Also Read: తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం భారీ విరాళం.. ఏపీ పంచాయతీలకు మరో రూ. 4 కోట్లు ?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×