E-Paper
Advertisement

Uttamkumar counter to KCR : ఎన్నికల తర్వాత దుకాణం క్లోజ్.. కొత్త డ్రామా.. అబద్ధాలు

Uttamkumar counter to KCR : ఎన్నికల తర్వాత దుకాణం క్లోజ్.. కొత్త డ్రామా.. అబద్ధాలు
Advertisement

Uttamkumar counter to KCR :

Uttamkumar counter to KCR : పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఎన్నికల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కేసీఆర్ భయాందోళనలో ఉన్నారని, అందుకే పొలం బాట పట్టారని చెప్పుకొచ్చారు. తొలుత జాతీయ పార్టీ అన్నారని, కానీ ఇంత తొందరగా ఏ పార్టీ కుప్పకూలిపోలేదన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరన్నారు మంత్రి ఉత్తమ్.

Advertisement

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇరిగేషన్ సెక్టార్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. అసలు ఇరిగేషన్‌పై మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. తన స్వార్థం కోసం ఇరిగేషన్ సెక్టార్‌‌‌ను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. రైతులను కేసీఆర్ ఏనాడూ ఆదుకోలేదని, కాలేశ్వరం పిల్లర్ కుంగిపోవడంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సిగ్గు లేకుండా ఆయన ఎలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ మాట్లాడిన ప్రతీ మాట అబద్ధమేనని, ప్రస్తుతం ఆయన డిప్రెషన్‌లో ఉన్నారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. పదేళ్లలో పంట నష్టం జరిగితే..  కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని కేసీఆర్ అంగీకరించారని విమర్శించారు. జగన్‌తో కలిసి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందన్నారు.

Advertisement

ALSO READ: ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త మలుపు, ఈ వారంలో నేతలకు నోటీసులు!

విద్యుత్ సెక్టార్‌పైనా కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు మంత్రి ఉత్తమ్. టెక్నికల్ సమస్య వచ్చి కరెంటు పోతే కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారమన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదన్నారు. పోలీసు శాఖను ఎక్కువగా మిస్ యూజ్ చేసింది కూడా కేసీఆరేనని చెప్పుకొచ్చారు. పోలీసులు న్యూట్రల్‌గా ఉండాలని చెప్పి.. ఇప్పుడు ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరువు వచ్చింది బీఆర్ఎస్ పాలనలోనేనని దాన్ని సమర్థవంతంగా డీల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

 

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×