BigTV English
Advertisement

Minister Ponguleti on BRS: ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి పొంగులేటి!

Minister Ponguleti on BRS: ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి పొంగులేటి!

Ministers Ponguleti and Komatireddy Comments: రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై తమదైన రీతిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.


ఖమ్మం జిల్లా అరెంపల గ్రామంలో ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో రైతుని రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయం. మా ప్రభుత్వం పేదోడి కోసం పని చేసే ప్రభుత్వమంటూ నేను మనసుపూర్తిగా చెబుతున్నా. ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వం మాదిరిగా పది సంవత్సరాలు రుణమాఫీ ఇచ్చేయకుండా మాయ మాటలు చెప్పి గడిపినట్లుగా మా ప్రభుత్వం ఉండబోదు. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. రుణమాఫీ చేసి తీరుతాం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి పోయింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కుంగిపోయింది. ఓ పక్క ఆ ఏడు లక్షల కోట్ల రూపాయలకు అప్పు కట్టాల్సి వస్తుంది.. మరో పక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తున్నది’ అంటూ మంత్రి పేర్కొన్నారు.

Also Read: శాసనమండలిపై కాంగ్రెస్ ఫోకస్.. టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు


మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గత ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్షల కోట్ల అప్పులు చేసి పోయిందన్నారు. ఎన్‌హెచ్- 65 పై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామంటూ మంత్రి పేర్కొన్నారు. మొత్తం 17 బ్లాక్ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా చిట్యాల వద్ద రూ. 40 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. రూ. 30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.

Tags

Related News

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×