E-Paper
Advertisement

NASA Warning: నాసా హెచ్చరిక.. నేడు భూమి వైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం!

NASA Warning: నాసా హెచ్చరిక.. నేడు భూమి వైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం!
Advertisement

2024 KN1: కాలం గడుస్తున్నా కొద్దీ భూమిని ఢీ కొట్టే గ్రహశకలం భూమి వైపుకు దూసుకువచ్చేందుకు సమయం దగ్గర పడిందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి .ఈ నేపథ్యంలోనే యూఎస్ అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రమాదకరమైన గ్రహ శకలం భూమిని దగ్గరగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతరిక్ష సంస్థ నాసా అధికారిక నివేదిక ప్రకారం జూన్ 23 తేదీ ఆదివారం రోజున రాత్రి 11: 39 గంటలకు 2024 KN1 అనే గ్రహ శకలం భూమికి దగ్గరగా రానుంది. అయితే దీని గురించి నాసా ప్రజలను అప్రమత్తం చేసింది.

2024 KN1 గ్రహశకలం 88 అడుగుల పరిమాణంలో ఉంటుందని, గంటకు ఇది 16, 500 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలం అమోర్ సమూహానికి చెందినది. ఆదివారం ఇది భూమికి సమీపంగా వస్తుండటంతో నాసా హెచ్చరికను జారీ చేసింది. సాధారణంగా నాసా డాష్ బోర్డ్ భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలు, తోక చుక్కలను ట్రాక్ చేస్తుంది. డాష్ బోర్డు.. భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలు, తోక చుక్కల పరిమాణంతో పాటు అవి భూమి నుంచి ఎంత దూరంలో ఉంటాయి అన్న వివరాలను సూచిస్తుంది.

Advertisement

Also Read: అమెరికాలో వరద బీభత్సం.. డకోటాలో ఎమర్జెన్సీ

అంతే కాకుండా ఇది భూమికి 7.5 మిలియన్ కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రహ శకలాలను కూడా ట్రాక్ చేస్తుంది. నాసా ప్రకారం మన గ్రహాలు ఏర్పడిన తర్వాత గ్రహశకలాలు అనేకం మిగిలి ఉన్నాయి. అయితే ఈ గ్రహ శకలాలు అన్నీ ఒకే పరిమాణంలో ఉండవు. ఈ గ్రహ శకలాలు సూర్యుడి నుంచి వేరు వేరు దూరాలలో ఉంటాయి. ఏ రెండు గ్రహ శకలాలు కూడా ఒకేలా ఉండవు. అయితే ఈ గ్రహశకలాల్లో ఇనుము, నికెల్, మట్టి ఉంటాయి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×