E-Paper

ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల

ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల
Advertisement

MJPTBC Degree Admissions: స్వేచ్ఛ బ్యూరో: ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరానికి ఎంజేపీటీబీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎం జె పి కార్యదర్శి బడుగు సైదులు సూచించారు .ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఎంజoపీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఆయన అభినందించారు. ఎంజేపీ లో ఇంటర్ చదివిన విద్యార్థులు తమ సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

డిగ్రీ కోర్సులో ప్రవేశం

ఎంజేపీలో కాకుండా ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎంజేపీటీబీసీడ్ల్యూ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలలో (ఇంగ్లీష్ మీడియం) మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-Degree/ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకుని వారు కోరుకున్న కోర్సులో సీటు కేటాయించడం జరుగుతుందని ఆయన వివరించారు.

Advertisement

Also Read: రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న పదవుల వేట.. ఇక అందరి చూపు అటువైపే..?

ఆధునిక కోర్సులు..

రాష్ట్రవ్యాప్తంగా ఎంజేపీలో 30 డిగ్రీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, రెగ్యులర్ కోర్సులు బీఎస్సీ, బీకామ్, బీఏలతో పాటు బీఎస్సీ, బీబీఏ, బీఎఫ్​ టీ, అనిమేషన్, వి ఎఫ్​ ఎక్స్ మొదలైనవి ఆధునిక కోర్సులు అందిస్తున్నామని సైదులు తెలిపారు. గతంలో డిగ్రీ పూర్తి చేసిన ఎందరో విద్యార్థులకు ప్లేస్ మెంట్ లు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.ఎంజేపీ విద్యాసంస్థల్లో చేరిన ప్రతి విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా రాణించేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు అత్యున్నత విద్య అభ్యసించేలా శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించారు.

ఈ ఏడాది..

Advertisement

క్రీడల్లోనూ ఎం జె పి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలు కాలేజీ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనుకుంటే గురుకుల విద్యాసంస్థల్లో చేర్చాలని, చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకుంటారని ఆయన అన్నారు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం ఫోన్ నెం. 040-23328266 లో సంప్రదించాలని కార్యదర్శి సూచించారు.

Also Read: బచ్చన్నపేటలో బెల్ట్ షాపుల జాతర.. వైన్స్‌లో లేని స్టాక్ అక్కడ ఫుల్..?

Related News

Jana Sena: తెలంగాణ లీడర్లకు జనసేన గాలం.. అలాంటి నేతలే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం!

Nalgonda Tour: నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన

తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఆ తర్వాత హైదరాబాద్, సాయంత్రం ఆ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్‌లో డేంజరస్ గ్యాంగ్.. గల్లీల్లో అండర్‌గ్రౌండ్ WWE ఫైట్లు, రక్తం ఒలికేలా కొట్టుకుంటూ..!

Harish Rao: తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ పై.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!

Lake Restoration: మరో చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చిన హైడ్రా..!

Farmer Exploitation: దమ్ముంటే విచారణ జరపండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవన్ రెడ్డి చాలెంజ్!

Big Stories

×