MLA Arekapudi Gandhi: హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని గుడివాడ అలంకార్ రెస్టారెంట్ని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా పాల్గొన్ని రెస్టారెంట్ ప్రారంభించారు. ఎమ్మెల్యే, బైరెడ్డి సిద్ధార్థ్తో కలిసి ప్రేమ్ కుమార్, రెస్టారెంట్ ఎండీ మీనాకుమారిలు కూడా రెస్టారెంట్ ప్రారంభించారు.
ఈ రెస్టారెంట్ ద్వారా నగరంలో సుమారు నలభైకి పైగా ఆంధ్ర ప్రాంతపు గుడివాడ రూచులను అందించడమే తమ ప్రత్యేకత అని, గుడివాడ అలంకార్ ద్వారా భోజన ప్రియులకు వైవిధ్యమైన రుచుల ద్వారా మనోహరన్ని అందిస్తోంది. ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించే శాకాహారం, మాంసాహారంతో విభిన్న రుచులతో అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ… అన్ని ప్రాంతాలలో వ్యాపారం ఉండాలని ఉపాధి కల్పన పెంచుతూ మంచి రుచికరమైన వంటకాలు అందిస్తున్నారని రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందించారు.
రుచి, నాణ్యతనే ఎప్పుడూ ప్రజలు కోరుకుంటారని, మరిన్ని శాఖలు రెస్టారెంట్ విస్రత పరిచి ముందు సాగాలని అన్నారు. అలాగే బైరెడ్డి సిద్ధార్థ్ మాట్లాడుతూ.. 1968 లో మొదట గుడివాడ అలంకార్ ను ప్రారంభించి యాభై కి పైగా సంవత్సరాలు రెస్టారెంట్ బిజినెస్ ను నడపడం చాలా కష్టమైన పని. కానీ రుచి, నాణ్యత తో పాటు ఎంతో శ్రమ, తన అభిరుచి వలన ఇన్ని సంవత్సరాలు ముందుకు తీసుకువచ్చారన్నారు. హైదరాబాద్ వారికి అందుబాటులో ఉండడం, ఉద్యోగ అవకాశాలు కల్పన మంచిది అని వారికి అభినందనలు తెలిపారు. ఇక రెస్టారెంట్ ఎండీ మీనా కుమారి మాట్లాడుతూ.. తమ వద్ద వేజ్ అండ్ నాన్వెజ్ తాలితో పాటు రకరకాల సీ ఫుడ్ చాలా స్పెషల్ వంటకాలను అందిస్తున్నామని. మాదాపూర్ లో తాము ప్రారంభించిన ఈ రెస్టారెంట్ లో ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేసే వసతులు కల్పిస్తున్నామని, భిన్న రకాలు వంటకాల రుచికరంగా ప్రజలకి అందించడం తమ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె పేర్కొన్నారు.