Muduchintalapalli Municipality: మేడ్చల్, బ్యూరో, స్వేచ్ఛ : ముడుచింతల పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 14 వార్డులు, కాంగ్రెస్కు 9 వార్డులు, బీజేపీకి 1 వార్డు లభించాయి. బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్కు మొత్తం 15 ఓట్లు వచ్చాయి. చైర్మన్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి జాము రవి పేరును 13వ వార్డు కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రతిపాదించగా, 6వ వార్డు కౌన్సిలర్ నిరజ్ గౌడ్ బలపరిచారు. జరిగిన ఎన్నికలో జాము రవికి 15 ఓట్లు లభించి చైర్మన్గా ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్ 16వ వార్డు కి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి శశిరేఖ రెడ్డి పేరును 12వ వార్డు కౌన్సిలర్ మౌనిక ప్రతిపాదించగా, 7వ వార్డు కౌన్సిలర్ నవీన్ నాయక్ బలపరిచారు. జరిగిన ఎన్నికలో శశిరేఖకు కూడా 15 ఓట్లు లభించి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీంతో మూడుచింతల పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండూ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.