E-Paper
Advertisement

Maoists Killed in Mulugu District: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్… ఏడుగురు మావోయిస్టులు మృతి

Maoists Killed in Mulugu District: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్… ఏడుగురు మావోయిస్టులు మృతి
Advertisement

Maoists Killed in Mulugu District: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్… ఏడుగురు మావోయిస్టులు మృతిమావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో తాజాగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.  తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. మృతిచెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్టు సమాచారం. ఏటూరునాగారం మండలంలోని కొండాయి చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జ‌రిగాయి.

ఈ ఎన్కౌంట‌ర్ లో మొత్తం ఏడుగురు సభ్యులు మృతి చెందారు. మృతుల్లో 1. కుర్సం మంగు అలియాస్ భద్రు, అలియాస్ పాపన్న, TSCM, సెక్రటరీ యెల్లందు, నర్సంపేట, ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, DVCM, కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్, ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సాకి జమున, జైసింగ్ (పార్టీ సభ్యుడు) కిషోర్ (పార్టీ సభ్యుడు), కామేష్ (పార్టీ సభ్యుడు) ఉన్నారు.

Advertisement

కొద్దిరోజుల క్రితమే ములుగు జిల్లాలో ఇన్ ఫార్మ‌ర్ల నెపంతో ఇద్దరు యువకులను మావోయిస్టులు హతమార్చారు. త‌మ సమాచారాన్ని పోలీసుల‌కు చేర‌వేత‌స్తున్నార‌ని దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టుల‌ను హెచ్చరిస్తూ గిరిజన యువత పేర్లతో బహిరంగ లేఖలు జిల్లాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి. మరోవైపు కొన్ని నెలలుగా మావోయిస్టులను బలగాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణలోని అడవుల్లో మావోయిస్టుల కోసం జ‌ల్లెడ ప‌డుతూ హ‌త‌మారుస్తున్నారు.

Also read:  బాలినేనికి లక్కీఛాన్స్.. మంత్రి పదవి కన్ఫామ్‌?

Advertisement

వ‌రుస ఎన్కౌంట‌ర్లు జ‌రుగుతుండంతో మావోయిస్టు పార్టీకి వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఒక్కో ఎన్కౌంటర్ లో 20 నుండి 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవ‌డం ఆ పార్టీకి తీర‌ని న‌ష్టాన్ని క‌లిగిస్తోంది. ఈ క్ర‌మంలో మావోయిస్టుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, ఎన్ కౌంట‌ర్లు ప‌రిష్కారం కాద‌ని ప్ర‌జాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఏడుగురు మృతి చెంద‌గా గత నెల 22న చత్తీస్గడ్ లోని భిజీ ప్రాంతంలో జ‌రిగిన ఎన్కౌంట‌ర్ లో ప‌దిమంది మావోలు కన్నుమూశారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు పోలీస్ సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు.

Tags

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×