E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
Advertisement

Road Accident: అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందంగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని మెరుగైన వైద్యం కోసం బళ్లారి తరలించారు. డ్రైవర్ మినహా మిగిలిన వారంతా వైద్యులుగా తెలుస్తోంది. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బెంగళూరు నుంచి బళ్లారికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చెట్టును కారు వేగంగా ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో 42 వ జాతీయ రహదారిపై.. ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి బళ్లారి వెళ్తుండగా కారు అదుపుతప్పు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో స్పాట్ లోనే ముగ్గురు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం బళ్లారి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు డాక్టర్లు గోవిందరాజులు, యోగేష్ , డ్రైవర్ వెంకట నాయుడుగా పోలీసులు తెలిపారు. వీరందరు హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రమైన మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

Also Read: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో నలుగురు మృతి

ఇదిలా ఉంటే..హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌, ఆటోను స్విఫ్ట్ కారు ఢీకొన్న ఘటనలో దంపతులు దుర్మరణం చెందారు. కారు డ్రైవర్.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×