Municipal Polling: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డిలోని 6, మేడ్చల్లోని 3, వికారాబాద్లోని 4 మున్సిపాలిటీలో జరిగిన పొలింగ్ విధానంపై ఎప్పటికిప్పుడు జిల్లా కలెక్టర్, ఆయా పరిధిలోని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. సమస్యత్మాక ప్రాంతాలను పోలీస్ కమీషనర్లు పర్యటించి స్ధానికులను పరిస్థితులపై ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో నా ఓటు వేశారని బాధితురాలు బహిరంగంగా వెల్లడించారు.
దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పడంతో స్ధానికంగా కలకలం రేగింది. అదేవిధంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీజేపీ అభ్యర్ధి నకిలీ వెండి నాణేలు పంపిణీ చేసి ఓటర్లను మోసం చేశారనే దుమారం రెగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో తగినంత పోలింగ్ కాలేదని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలుంటే 78.52, వికారాబాద్లో 4 మున్సిపాలిటిల్లో 71.82, మేడ్చల్ల్లో 3 మున్సిపాలిటీలుంటే 83.99 శాతం చోప్పున పొలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ పోరు.. జోరుగా పోలింగ్.. 73.01 శాతంగా నమోదు
మూడు జిల్లాలో 13 మున్సిపాలిటీలుంటే మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ టాప్లో ఉంది. ఆరు, నాలుగు మున్సిపాలిటీలున్నప్పటికి 80శాతం పోలింగ్ నమోదు కాలేదు. ఒకప్పుడు ఈ మున్సిపాలిటీలన్ని రూరల్ ప్రాంతాలే… ప్రస్తుతం కూడా ఈ ప్రాంతాలు గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది. కోర్ సిటీ ప్రాంతాల్లో పొలింగ్ శాతం 50శాతం దాటటం గగణమని మాట్లాడుకుంటారు. కానీ ప్రస్తుత మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతాల ప్రభావం ఉంటుంది కనుక అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావాల్సి ఉండేదని అధికారులే చర్చించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అమన్గల్, చేవెళ్ల 80శాతం దాటితే… ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంకర్పల్లి, షాద్నగర్ 79 శాతం దాటలేదు. అదే వికారాబాద్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలుంటే పరిగి 77శాతం, కొడంగల్, వికారాబాద్ 75 శాతం లోపు, తాండూర్ 67శాతం పోలింగ్తోనే సరిపెట్టుకుంది. మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మూడుచింతలపల్లి 89శాతం, ఎల్లంపేట్లో 83, అలియాబాద్లో 79.62 శాతం చోప్పున పొలింగ్ నమోద్ అయ్యింది. పరిగి మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఒక శాతం అధికంగానే ఓటింగ్లో పాల్గోన్నారు.
Also Read: Nikhil: ‘స్వయంభు’ కథ ఎవరిదో చెప్పిన నిఖిల్.. 1000 ఏళ్ల క్రితం అల్లరిచిల్లరిగా తిరిగే అతని కథంట!