తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మున్సిపాలిటీల్లోనే ఓటింగ్ శాతం అధికంగా ఉండటం విశేషం.
వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును భారీగా వినియోగించుకున్నారు. ఇక్కడ అత్యధికంగా 75.88 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు, కార్పొరేషన్ల పరిధిలో ఓటింగ్ సరళి కాస్త నెమ్మదిగా సాగింది.
నగర ప్రాంతాల్లో ఓటర్ల విముఖత ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. ఇక్కడ కేవలం 66.05 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని చోట్ల ఓటింగ్ శాతం పెరగడం విశేషం. పటిష్టమైన భద్రత మధ్య సాగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు.
ALSO READ: Gadwal News: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోరు.. ఐజలో అత్యధికంగా 84.69 శాతం పోలింగ్ నమోదు!