E-Paper
Advertisement

Murder in narayanapeta: నారాయణపేటలో దారుణం.. భూ తగాదాలతో అందరూ చూస్తుండగానే కర్రలతో కొట్టి చంపేశారు

Murder in narayanapeta: నారాయణపేటలో దారుణం.. భూ తగాదాలతో అందరూ చూస్తుండగానే కర్రలతో కొట్టి చంపేశారు
Advertisement

Murder in narayanapeta: నారాయణపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా కొట్టి హతమార్చారు. ఈ ఘటన ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్లలో జరిగింది. గాయపడిన అదే గ్రామానికి చెందిన సంజీవ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దాయాదుల దాడి..

Advertisement

పొలం విషయంలో జరిగిన గొడవకు దాయాదులు దాడి చేసి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సంజీవ్.. ఇటీవల గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ తరుణంలో తన నాలుగు ఎకరాలు భూమి విషయంలో దాయాదుల మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ చివరికి ఘర్షణకు దారి తీయడంతో కర్రలతో సంజీవ్‌పై దాయాదులు ఒక్కసారిగా దాడి చేశారు.

అందరూ చూస్తుండగానే..

Advertisement

చిన్నపొర్లకు చెందిన లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య బాలమ్మ కుమారుడు సంజప్ప..రెండో భార్య తిమ్మమ్మ కుమారులు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప. అయితే లక్ష్మప్పకు ఉన్న 9 ఎకరాలను ముగ్గురు సమానంగా పంచుకున్నారు. ఈ పంపకాల్లో అన్యాయం జరిగిందని సంజప్ప అభ్యంతరం వ్యక్తం చేశాడు. తర్వాత పొలం దున్నేందుకు చిన్న సౌరప్ప, పెద్ద సౌరప్ప వెళ్లగా.. విషయం తెలుసుకున్న సంజప్ప అక్కడికి వెళ్లి అడగగా గొడవ జరిగింది. అందరూ చూస్తుండగానే సంజప్పపై కర్రలతో దాడి చేశారు.

అంబులెన్స్ అడ్డుకున్న బంధువులు..

మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొస్తుండగా..అంబులెన్స్ ను మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊట్కూర్ ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య దాడి జరుగుతుండగా.. ఎస్‌ఐ, డయల్ 100కు ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారా.. ప్రాణాలు తీసేందుకు ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటలు గడిచినా అంబులెన్స్ ముందు బైఠాయించారు.

ఎస్‌ఐ సస్పెండ్

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఊట్కూర్ ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దాడి ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు కాగా..ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏ4 చిన్న సంజప్ప, ఏ5 గుడి ఆశప్ప, ఏ6 గువ్వల శ్రీను, ఏ7 గువ్వల కిష్టప్పలను అరెస్ట్ చేశామని.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఐజీ పేర్కొన్నారు.

Tags

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×