E-Paper
Advertisement

Telangana : ప్రాణం తీసిన మటన్ ముక్క.. ఎక్కడంటే.. ఎలాగంటే..

Telangana : ప్రాణం తీసిన మటన్ ముక్క.. ఎక్కడంటే.. ఎలాగంటే..
Advertisement

Telangana : మటన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్‌వెజ్ ప్రియులంతా లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. ఫంక్షన్లలో వండే మటన్ టేస్ట్ మరో రేంజ్‌లో ఉంటుంది. భోజనాల్లో చికెన్ పెడితే చీప్‌గా చూస్తుంటారు. అదే మటన్‌తో దావత్ ఇస్తే మాత్రం.. ధూంధాం సందడే. మటన్ భోజనం కోసం ఎగబడుతుంటారో ఊర్లళ్లో జనం. అంతెందుకు, సండే వస్తే సిటీల్లో మటన్ షాపుల ముందు పెద్ద క్యూ లైన్లే ఉంటాయి. హైదరాబాద్‌లోనైతే గంటల తరబడి నిలబడితే కానీ మటన్ దొరకని పరిస్థితి. సండే, మటన్ కర్రీ.. ఆ కాంబినేషనే వేరబ్బా. ఫంక్షన్, మటన్ భోజనం.. ఆ మజానే వేరే లెవల్.

పెళ్లిళ్లో మటన్ కోసం గొడవలు జరిగిన ఘటనలు తెలంగాణలో అనేకం ఉంటాయి. ముక్కలు వేయలేదని కొందరు, బొక్కలు పడ్డాయని ఇంకొందరు, సూప్ మాత్రమే వేస్తున్నారని మరికొందరు.. ఇలా మటన్ చుట్టూ ముష్టియుద్ధాలు చాలానే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు కొన్ని విషాద సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అలాంటిదే ఓ అనూహ్య పరిణామం ఈ ఉదంతం.

Advertisement

నిజామాబాద్ జిల్లా బొప్పాస్‌పల్లికి చెందిన 48 ఏళ్ల రుత్వాన్‌ తారాసింగ్ బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు. విందులో మటన్ వడ్డించారు. మటన్ ముక్కలు ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. సడెన్‌గా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. మింగలేక, కక్కలేక పోయాడు. నీళ్లు తాగినా ముక్క కదల్లేదు. శ్వాస పీల్చడం కూడా కష్టమైపోయింది. అతను కిందపడిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మటన్ ముక్క అడ్డుపడడంతో శ్వాస ఆడక ఊపిరి ఆగిపోయిందని డాక్టర్లు చెప్పారు.

తారాసింగ్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పుడా కుటుంబం ఇంటిపెద్దను కోల్పోయింది. మటన్ పీస్ ఆ ఫ్యామిలీని రోడ్డున పడేసింది. విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. జరిగిన ఘటనపై తెగ చర్చించుకుంటున్నారు.

Advertisement

Also Read : పెళ్లి భోజనం బాలేదంటే.. కాల్చి పడేసిన బంధువులు

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×