E-Paper
Advertisement

Medchal News: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం : కౌన్సిలర్ నిశిత రెడ్డి

Medchal News: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం  : కౌన్సిలర్ నిశిత రెడ్డి
Advertisement

Medchal News: స్వేచ్ఛ, బ్యూరో:   ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని మైసిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సాధికారతపై  అవగాహన సదస్సు నిర్వహించారు. 22వ వార్డు కౌన్సిలర్ నిశిత రెడ్డి ఆధ్వర్యంలో, లయోలా కళాశాల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం గ్రామ మహిళల్లో చైతన్యం నింపింది.

మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభం 

ఈ సందర్భంగా కౌన్సిలర్ నిశిత రెడ్డి మాట్లాడుతూ మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబులు కావాలంటే స్వయం సహాయక సంఘాల బలోపేతం అత్యవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కరుణాకర్, బాబు రావు, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Theertham: గుడిలో తీర్థము తీసుకున్నప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి – ఇంకా గుడిలో ఎలా ఉండాలంటే 

ఈటల రాజేందర్‌ను కలిసిన  వైస్ చైర్‌పర్సన్

స్వేచ్ఛ, బ్యూరో: మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం షామీర్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆమె పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపాలిటీ ప్రజలు నమ్మకంతో గెలిపించారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంగా ఉండాలని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి విలాసాలపై హరీష్ రావు సెటైర్లు!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×