E-Paper
Advertisement

Rice Mill Scam: రూ. 43 కోట్లు పక్కదారి పట్టించిన మిల్లర్లు.. ఎస్పీ యాక్షన్ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

Rice Mill Scam: రూ. 43 కోట్లు పక్కదారి పట్టించిన మిల్లర్లు.. ఎస్పీ యాక్షన్ ప్లాన్‌ మామూలుగా లేదుగా!
Advertisement

Rice Mill Scam: నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ ధాన్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతమైంది. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఇద్దరు నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో పోలీసులు ఈ అక్రమాలపై లోతైన దర్యాప్తు చేపట్టి, కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

2022-23 యాసంగి కాలంలో జిల్లాలోని ఏడు రైస్ మిల్లులకు ప్రభుత్వం సుమారు 7.40 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ (CMR) కోసం కేటాయించింది. అయితే.. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయి, బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సివిల్ సప్లైస్ విజిలెన్స్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో ఈ భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యానికి, రికార్డులకు పొంతన లేకపోవడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

Advertisement

ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ ఏడు మిల్లుల ద్వారా సుమారు రూ. 42.80 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లర్లు వ్యక్తిగత లాభాల కోసం మళ్లించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలతో విచారణను వేగవంతం చేశారు.

Also Read: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×