E-Paper
Advertisement

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఏఐసీసీ ప్రకటన

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఏఐసీసీ ప్రకటన
Advertisement

Jubilee Hills By Election: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిని ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా వి.నవీన్‌ యాదవ్‌ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. నవంబరు 11న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్‌ (62) ఇటీవల గుండెపోటుతో మృతి చెదారు. దీంతో ఉపఎన్నికల అనివార్యమైంది. గత ఎన్నికల్లో నవీన్‌ యాదవ్‌ ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.

పార్టీ అభ్యర్థి గెలుపు కోసం

జూబ్లీహిల్స్ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి కీలక నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. ఏఐసీసీ మాత్రం స్థానికంగా బలంగా ఉన్న నవీన్ వైపే మొగ్గుచూపింది. నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి గెలుపు కోసం పనిచేయాలని కోరారు. భవిష్యత్తులో వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, ఎంఐఎం

Advertisement

అసంతృప్త నేతలు తప్పుకోవడంతో నవీన్ యాదవ్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా టికెట్ దక్కిందని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు టీడీపీ, ఎంఐఎంలు దూరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించాయి. మరో పార్టీ బీజేపీ ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు చేయలేదు. దీంతో బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠగా మారింది.

Also Read : BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా

Advertisement

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11, 2025న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధితో పాటు అభ్యర్థుల వ్యక్తిగత చరిత్రతో దృష్టిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

 

Related News

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Big Stories

Advertisement
×