Nizamabad Murder Case: నిజామాబాద్ జిల్లాలో జరిగిన హత్య కేసులో.. న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఆటోడ్రైవర్ను అతికిరాతకంగా చంపిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ.. జిల్లా న్యాయమూర్తి దుర్గాప్రసాద్ తీర్పు ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలో బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ సందీప్ను.. అతికిరాతంగా హత్య చేశాడు సతీస్ గౌడ్ అనే వ్యక్తి. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆటో విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం చివరకు ఓ యువకుడి ప్రాణాలు తీసే స్థాయికి దారి తీసింది.
సందీప్, సతీష్ గౌడ్ ఇద్దరి మధ్య ఆటోకు సంబంధించిన విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి ప్రాంతానికి చేరుకోగానే సతీష్ గౌడ్ అనే వ్యక్తి సతీష్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఐదవటం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు పోలీసులు. ప్రత్యక్షుల వాంగ్మూలం, సీసీటీవి పుటేజ్లు సేకరించి సమగ్ర ఛార్జ్ షీట్ ధాఖలు చేశారు.
Also Read: రూ.3 వేల కోట్ల భారీ స్కామ్.. ‘సాహితీ’పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
ఈ కేసును సుధీర్ఘంగా విచారించారు న్యామూర్తి దుర్గాప్రసాద్. నిందితుడు సతీష్ గౌడ్ కి 238 బి.ఎన్.ఎస్ యాక్ట్, ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 307 ఐదేళ్ల కఠిన గారగార శిక్ష, 301 చివరిగా 10 వేల జరిమానా చివరగా ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
హత్య కేసులో నిజామాబాద్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు
నిందితుడికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి దుర్గ ప్రసాద్
నిజామాబాద్ లోని బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సందీప్ ను అతి దారుణంగా హత్య చేసిన సతీష్ గౌడ్
గత ఏడాది ఫిబ్రవరిలో ఘటన
ఆటో విషయంలో గొడవపడి ఇందల్వాయి ప్రాంతంలో… pic.twitter.com/LU4GSrp0JN
— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2026