E-Paper
Advertisement

ATM Robbery: నిజామాబాద్‌లో ఏటీఎం దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు చోట్ల చోరీ..

ATM Robbery: నిజామాబాద్‌లో ఏటీఎం దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు చోట్ల చోరీ..
Advertisement

ATM Robbery: నిజామాబాద్ జిల్లాలో జరిగిన భారీ ఏటీఎం దోపిడీ ప్రస్తుతం తీవ్ర కలకలం సృష్టించింది. అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో వ్యవహరించిన అంతర్రాష్ట్ర ముఠా, నగరాన్ని అల్లాడించింది. సాయి నగర్ లోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి సుమారు 10 లక్షల రూపాయలు, ఆర్యనగర్ లోని డీసీబీ ఏటీఎం నుంచి ఏకంగా 27 లక్షల రూపాయలను గ్యాస్ కట్టర్ల సాయంతో దోచుకున్నారు. ఈ క్రమంలో నిందితులు వాడిన గ్యాస్ కట్టర్ల వేడికి ఏటీఎంలోని కొంత నగదు కాలిపోయి బూడిదైనట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దారుణానికి పాల్పడింది మహారాష్ట్ర లేదా రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ప్రొఫెషనల్ ముఠా అయి ఉండవచ్చని డీసీపీ బస్వారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వీరు కేవలం దోపిడీ చేయడమే కాకుండా, ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఏటీఎంలోని సీసీ కెమెరాలకు స్ప్రే పెయింట్ వేసినట్లు తెలుస్తుంది. నిందితులు పక్కా ప్లాన్‌తో వచ్చి, అతి తక్కువ సమయంలోనే పని ముగించుకొని పరారయ్యారు.

Advertisement

ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా సంఘటనా స్థలాలను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్లూస్ టీమ్, నిందితులు ప్రయాణించిన వాహనాన్ని గుర్తించే పనిలో ఉంది. ముఠా కదలికలను బట్టి వారు సరిహద్దు దాటి వెళ్లకుండా పక్క రాష్ట్రాల పోలీసులను కూడా తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు.

Also Read: మహబూబాబాద్‌లో హైటెన్షన్! ఒకే రోజు ఇద్దరు నాయకుల రాకతో హీటెక్కిన రాజకీయం 

Advertisement

అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో పాటు పాత నేరస్తుల రికార్డులను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఏటీఎంల వద్ద భద్రతా చర్యలు పెంచాలని బ్యాంక్ యాజమాన్యాలకు పోలీసులు సూచించారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×