E-Paper
Advertisement

Hospital: రోగిని ఈడ్చుకెళ్లిన పేరెంట్స్.. ఆసుపత్రిలో దారుణం.. సిగ్గు సిగ్గు..

Hospital: రోగిని ఈడ్చుకెళ్లిన పేరెంట్స్.. ఆసుపత్రిలో దారుణం.. సిగ్గు సిగ్గు..
Advertisement
nizamabad hospital

Hospital (Telangana News): నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకి.. అనేది పాత మాట. ఇప్పుడు ఆసుపత్రులన్నీ మార్చేస్తాం.. మంచి వైద్యం, వసతులు కల్పించాం అనేది సర్కారు మాట. మరి, నిజమేనా? నిజంగానే తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల తలరాత మారిందా? అంటే డౌటే. అప్పుడప్పుడు, అక్కడక్కడ జరిగే కొన్ని దారుణ ఘటనలు మళ్లీ సరకారు దవాఖానాలంటేనే భయం గొలిపేలా ఉంటున్నాయి. తాజాగా, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అలాంటి ఘటనే జరిగింది.

నిజామాబాద్ ఆసుపత్రిలో ఓ రోగిని నేలపై ఊడ్చుకుంటూ వెళ్తున్నారు అతని తల్లిదండ్రులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను, మెయిన్ మీడియాను షేక్ చేస్తోంది. స్ట్రెచ్చర్/ వీల్‌ఛైర్ లేకపోవడంతో ఆ రోగిని కాళ్లుపట్టుకుని ఈడ్చుకెళ్లారని అంటున్నారు. వీడియోలో ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 31న జరిగిన ఈ ఘటన.. లేటెస్ట్‌గా వైరల్ అవుతోంది. సర్కారు నిర్లక్ష్యం, ప్రభుత్వాసుపత్రుల్లో దారుణ పరిస్థితులపై అంతా భగ్గుమంటున్నారు.

Advertisement

అయితే, హాస్పిటల్ సూపరింటెండెంట్ వాదన మరోలా ఉంది. సిబ్బంది వీల్‌ఛైర్ తెచ్చేలోగా.. లిఫ్ట్ వచ్చిందని వాళ్లే హడావుడిగా అలా లాక్కువెళ్లారని చెబుతున్నారు. పేషెంట్ రెండో అంతస్తుకు వెళ్లాక అతడిని వీల్‌ఛైర్‌లోనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారని.. తిరిగి వీల్‌ఛైర్‌లోనే సిబ్బంది ఆ పేషెంట్‌ను కిందకు తీసుకొచ్చారని చెబుతున్నారు. ఆస్పత్రిపై దుష్ప్రచారాలు చేసే వారిపై చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు ఆ సూపరింటెండెంట్‌.

మరోవైపు, ఇలా మీడియాలో ఈ న్యూస్ వచ్చిందో లేదో.. అలా వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ట్వీటర్‌లో స్పందించారు. కనీసం స్టెచ్చర్ కూడా లేని దౌర్భాగ్యపు ఆసుపత్రులు ఉన్నాయంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.

Advertisement

ఎవరి వాదన ఎలా ఉన్నా.. అసలేం జరిగిందనేది హాస్పిటల్ సీసీకెమెరా ఫూటేజ్ బయటపెడితే కానీ తెలీదు. అందాక ఎవరి గోల వారిదే.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×