E-Paper
Advertisement

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ వివాదం.. అధికారుల అరాచకం..

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ వివాదం.. అధికారుల అరాచకం..
basara iiit

Basara IIIT news today(Latest news in telangana): నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు.. విద్యార్థులపై మరోసారి తమ కర్కశాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు సెలవుపై వెళ్లిన సమయంలో.. వారి రూం తాళాలు తీసి వస్తువులను బయటపడేశారు. అధికారులు చేసిన పనితో విలువైన పుస్తకాలు, దుస్తులతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా పోగొట్టుకున్నామని వారు వాపోయారు.

బాసర ట్రిపుల్ ఐటీకి మే ఐదో తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. సెలవులకు వెళ్లేవారు తమతమ వస్తువులను తీసుకెళ్లడం సాధారణమే. అయితే పీయూసీ 2 విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాలేదు. దీంతో వారంతా తమతమ పుస్తకాలు, వస్తువులను వారి గదుల్లోనే పెట్టి సొంతూళ్లకు వెళ్లిపోయారు.

సెలవులు పూర్తవుతున్న క్రమంలో బాసర హాస్టల్ అధికారులు.. విద్యార్థులకు ఎలాంటి సమాచారం అందించకుండా వారి వస్తువులను గదుల నుంచి బయటపడేశారు. హాస్టల్ భవనం మెట్ల కిందకు చేర్చారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారుల తీరు పట్ల మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయల విలువైన పుస్తకాలు, వస్తువులు పోగొట్టుకున్నామని వాపోతున్నారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×