E-Paper
Advertisement

Oil Crunch in Telangana: తెలంగాణలో ఆయిల్ సంక్షోభం.. పెట్రోల్ పంపుల వద్ద క్యూ లైన్లు, మరి బస్సుల మాటేంటి?

Oil Crunch  in Telangana: తెలంగాణలో ఆయిల్ సంక్షోభం.. పెట్రోల్ పంపుల వద్ద క్యూ లైన్లు, మరి బస్సుల మాటేంటి?
Advertisement

Oil Crunch in Telangana: పశ్చిమాసియాలో ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధ జ్వాలలు భారత్‌లో ఇంధన సెగను రాజేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో పెట్రోల్ పంపులు మూతబడటం, తెరిచి ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తుండటంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయంతో వాహనదారులు తమ ట్యాంకులను ఫుల్ చేయించుకోవడానికి ఎగబడటంతో, బంకుల వద్ద కృత్రిమ కొరత ఏర్పడి “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి.

తెలంగాణలో ఆయిల్ సంక్షోభం.. పెట్రోల్ పంపుల వద్ద క్యూ లైన్లు

Advertisement

తెలంగాణలో ఆయిల్ సంక్షోభం తీవ్రమైంది.  దీని ప్రభావం హైదరాబాద్ సిటీపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే నగర శివారులోని  పలు పెట్రోల్ పంపులు మూతబడ్డాయి.  అయితే ఆయిల్ నిబంధనల నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి వాహనదారులు పెట్రోల్ కోసం పంపుల వద్ద బారులు తీరారు. అందుకు వినియోగదారులు గంట లేదా రెండు గంటలపాటు పెట్రోల్ పంపుల వద్ద వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం పెట్రోల్ పంపుల వద్దకు వెళ్లినవారు ఆఫీసులకు రావడం ఆలస్యంగా కనిపించింది.  ఇంకా పెట్రోల్ పంపుల వద్ద రద్దీ కొనసాగుతోంది.

ద్విచక్ర వాహనాలు, కార్ల పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య ప్రజల జీవనాడి అయిన ఆర్టీసీ బస్సుల పరిస్థితిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత పుకార్ల నేపథ్యంలో బస్సులు నిలిచిపోతాయేమోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారుల సమాచారం ప్రకారం, బస్సు సర్వీసులకు ప్రస్తుతానికి ఎటువంటి డీజిల్ ఇబ్బంది లేదు. ఆర్టీసీకి స్వంతంగా డిపోలలో భారీ నిల్వ సామర్థ్యం ఉండటంతో పాటు, వీటికి నేరుగా చమురు కంపెనీల నుంచి సరఫరా జరుగుతుంది కాబట్టి సాధారణ వాహనదారుల రద్దీ ప్రభావం వీటిపై పడదు.

Advertisement

మరి ఆర్టీసీ బస్సుల మాటేంటి? సామాన్యుడిలో రకరకాల ఆలోచనలు

యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (అత్యవసర వస్తువుల చట్టం) కింద ఇంధన సరఫరాను క్రమబద్ధీకరిస్తూ, బస్సులు, అత్యవసర వాహనాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బస్సు సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టమవుతోంది.

మరోవైపు, పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న గందరగోళానికి ప్రధాన కారణం “అడ్వాన్స్ పేమెంట్” విధానంలో వచ్చిన మార్పులని డీలర్లు చెబుతున్నారు. గతంలో చమురు కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవి, కానీ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు నగదు చెల్లిస్తేనే స్టాక్ పంపిస్తున్నాయి. వరుస సెలవులు రావడం, బ్యాంకులు మూతబడటంతో డీలర్లు సకాలంలో డబ్బు చెల్లించలేకపోయారు, ఫలితంగా స్టాక్ ఆలస్యమైంది. దీనిని ప్రజలు “కొరత”గా భావించి భయాందోళనకు గురయ్యారు.

Also Read: ఆగిపోని అకాల వర్షాలు.. రేపటి నుంచి మళ్లీ ఉరుములు, మెరుపులతో.. 

ప్రస్తుతానికి ప్రభుత్వం, చమురు సంస్థలు దేశంలో తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తున్నాయి. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అవాస్తవ ప్రచారాలను నమ్మి అనవసరంగా బంకుల వద్దకు చేరి ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించవద్దని కోరుతున్నారు. సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×