BigTV English

Miyapur: మియాపూర్‌లో ఉద్రిక్తత..

Miyapur: మియాపూర్‌లో ఉద్రిక్తత..

People attacked police and officials: మియాపూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నవారిని హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. పలువురు అధికారులకు గాయాలయ్యాయి. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కబ్జాదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. భూకబ్జాదారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


Also Read: కేటీఆర్ వ్యాఖ్యలపై జాలి చూపించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అయితే, మియాపూర్ 100, 101 సర్వే నెంబర్ లో ఉన్న దాదాపు 504 ఎకరాల్లో ప్రజలు గుడిసెలు వేశారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారని వారు పేర్కొన్నారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీయాక్ట్ కేసులు పెడుతామంటూ పోలీసులు స్పష్టం చేశారు. సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లో అక్కడి నుంచి కదలబోమంటూ గుడిసెలు తీసేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.


Tags

Related News

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Konda Surekha vs Ponguleti: ఢిల్లీకి చేరిన పంచాయితీ.. పొంగులేటిపై సోనియాకు కొండా కంప్లైంట్

Big Stories

×