E-Paper
Advertisement

TGPSC: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచి..

TGPSC: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచి..
Advertisement

TGPSC Group 1: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను జూన్ 24న సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబోతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్ సైట్ లో తమ వివరాలను ఎంటర్ చేసి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవొచ్చని సూచించింది.

కాగా, ఇటీవల నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 4,03,667 అప్లికేషన్లు వచ్చాయని, 3,02,172 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపింది. ఇదిలా ఉంటే.. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతోపాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ జూన్ 13న విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే జూన్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: గ్రూప్ -2 అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం

అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి 4.03 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×