Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? నెక్ట్స్ సిట్ ఎవరికి నోటీసులు ఇవ్వనుంది? కవిత లేకుంటే కేసీఆర్కు ఇవ్వనుందా? దాదాపు ఏడుగంటలపాటు విచారణలో మాజీ ఎంపీ సంతోష్రావు ఏం చెప్పాడు? ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారా? లేకుంటే ఎవరినైనా ఇరికించే ప్రయత్నం చేశారా? ఫోన్ ట్యాపింగ్ మొదలు ఎండింగ్ వరకు అన్నిరకాల ప్రశ్నలు సిట్ రైజ్ చేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
సిట్ విచారణలో సంతోష్రావు గుట్టు విప్పేశారా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్రావుని సిట్ దాదాపు ఏడున్నర గంటలపాటు విచారించింది సిట్. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సిట్ ముందు హాజరైన ఆయన, రాత్రి 9 గంటలు గడిచినా రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో సంతోష్ని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది.
చివరకు రాత్రి 10.30 గంటలకు సిట్ ఆఫీసు నుంచి సంతోష్రావు బయటకు రావడంతో నేతలు, కార్యకర్తలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సిట్ ఆఫీసు నుంచి నేరుగా తన ఇంటికి ఆయన వెళ్లిపోయారు. విచారణకు సంబంధించి మాట్లాడాలని మీడియా ప్రశ్నించినప్పటికీ తర్వాత మాట్లాడుతానంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్రావుని సిట్ టీమ్ మంగళవారం సుదీర్ఘంగా విచారించింది. ఆయన నుంచి కీలక అంశాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన అధికారుల నుంచి సేకరించిన సమాచారం దగ్గర పెట్టి విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆనాటి ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా? ఆయన పేరుతో మీరు చేయించారా?
రాత్రి పదిన్నర వరకు సంతోష్రావు విచారణ
టాస్క్ఫోర్స్ అధికారులను ఏయే విషయాలపై సంప్రదింపులు చేశారు? ఆనాటి టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు పదవీ విరమణ పొందిన తర్వాత కొనసాగించాలని ఎందుకు ఒత్తిడి చేశారు? ఆనాటి డీజీపీతో కేసీఆర్ ఆదేశాలంటూ మాట్లాడింది ఎవరంటూ రకరకాల ప్రశ్నలు రైజ్ చేసిందట సిట్. విచారణలో పూర్తిగా కేసీఆరే చుట్టూనే ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
అలాగే ప్రగతి భవన్లో సమావేశాలు జరిగిన దానిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని సంతోష్రావు ఎవరెవరికి చేరవేశారు? ప్రభాకర్రావు తరచూ కేసీఆర్తో సమావేశమై ఏయే విషయాలపై చర్చించేవారు? అనే కోణంలో లోతుగా ఆరా తీసినట్లు తెలిసింది. ఇరువురు మధ్య ఏయే అంశాలు చర్చించేవారో తనకు తెలియదని చెప్పారట. చాలా ప్రశ్నలకు తనకు తెలియదని, అవన్నీపైస్థాయిలో జరిగేవని అన్నారట.
ALSO READ: మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల ఉక్కుపాదం
ఈ కేసులో సిట్ సేకరించిన ప్రతీ సమాచారన్ని దగ్గర పెట్టి అన్నికోణాల్లో ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆనాటి సీఎంవోలో ఆయన కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే అధికారుల వద్ద సమాచారం ఉంది. ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలన్నా తొలుత సంతోష్రావుని సమావేశం తర్వాత అధికారులుగానీ, రాజకీయ నేతలుగానీ కేసీఆర్ వద్దకు వెళ్లేవారట. సంతోష్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్కు నోటీసు ఇవ్వడం ఖాయమనే చర్చ అప్పుడే మొదలైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్రావు విచారణ
నిన్న రాత్రి 10.30 వరకు దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారులు
సంతోష్రావు స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు
అంత కూల్గా జరిగింది.. ప్రెస్నోట్ పంపిస్తానని విచారణ అనంతరం మాట్లాడిన సంతోష్ రావు
Former… https://t.co/MGFCnDh0UO pic.twitter.com/g1FkmfJuIE
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2026