E-Paper
Advertisement

Cantonment Polling: ముగిసిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్

Cantonment Polling: ముగిసిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్
Advertisement

Secunderabad Cantonment Assembly By Elections 2024: తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కంటోన్మెంట్ తోపాటు దేశంలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ ఈసీ విడుదల చేసి నేడు పోలింగ్ నిర్వహించింది. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికను ఎదుర్కొన్నాయి.

Advertisement

కాగా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే సోదరి నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్, బీజేపీ పార్టీ నుంచి టీఎన్ వంశ తిలక్ పోటీ చేశారు.

Also Read: Indigo Flight: శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిన విమానం,టేకాఫ్ సమయంలో..

Advertisement

అనివార్యమైన ఉప ఎన్నిక బరిలో నిలబడాలని స్థానిక లీడర్లు, గులాబీ శ్రేణులు, జనం తనను కోరుతున్నారని, వాళ్లందరి మద్దతుతో తాను ఈ ఉపఎన్నికలో పోటీ చేస్తున్నట్లు నివేదిత పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తన తండ్రి దివంగత నేత సాయన్నకు మద్దతుగా ప్రజలంతా నిలిచారు.. ఆ ప్రజలే తన సోదరి లాస్య నందితకు కూడా మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వాదించారని గుర్తు చేసుకుంటూ.. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమెను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసిన విషయం విధితమే.

Tags

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×