Ponnam Prabhakar: బంకిపూర్లో బీజేపీ కంచుకోట బద్దలైందంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విజయానికి బంకిపూర్ తీర్పు నిదర్శనం అని అన్నారు. బీజేపీ అహంకారానికి ప్రజలే గుణపాఠం చెప్పారన్న పొన్నం అన్నారు. నియోజక వర్గంలో 20 వేలకుపైగా మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాదించారని అన్నారు.
దేశంలో బీజేపీ పునాదులు కదులుతున్నాయన్న మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అధికార బలం కంటే ప్రజా తీర్పే గొప్పదంటూ వ్యాఖ్యానించారు. బంకిపూర్ ఫలితం దేశ రాజకీయాలకు కీలక సంకేతం అని పేర్కోన్నారు. దేశంలో యవత, నిరుద్యోగులకు బీజేపీ పార్టీపై అసంతృప్తి పెరుగుతోందని మంతంకి పొన్నం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్న విమర్శించారు.
Also Read: బీహార్లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు
దేశలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజా తీర్పే శిరోధార్యం అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. బంకిపూర్ నియోజక వర్గ తీర్పు దేశ రాజకీయ మార్పుకు నాందిపలుకుతుందని మంత్రి పోన్నం పేర్కోన్నారు. త్వరలో దేశంలో ప్రజల గొంతుకను అణచివేసే రాజకీయాలకు తగిన సమాధానం తప్పకుండా వస్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Also Read: సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!