Judges Increase: లోక్ సభలో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు బిల్లు ఆమోదం పట్ల ఎంపీ రఘునందన్ రావు హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. కేసుల విచారణ వేగవంతం చేయాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును కేంద్రం తీసుకు వచ్చిందని అన్నారు. దాదాపుగా సుప్రీం కోర్టులో లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఒక్క సంవత్సరంలో 65 వేల కేసులను డిస్పోస్ చేస్తే 75 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు.
దీంతో సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం 7వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. జడ్జిల పెంపుతో కక్షిదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని, మోదీ నాయకత్వంలో 2019 లో ఒకసారి, ఇప్పుడు మరోసారి జడ్జిల సంఖ్య పెంచి దేశప్రజలకు వేగంగా న్యాయం జరగాలని బిల్లు తీసుకొచ్చిందని తెలినపారు. కొలిజియంకి వ్యతిరేకంగా సర్వీస్ కమిషన్ తీసుకురావాలని గతంలో ప్రయత్నం జరిగిందని, గతంలో సుప్రీం కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు.
Alao Read: గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?
జస్టిస్ ఉజ్వల్ భూయాన్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల అభిప్రాయంగా భావిస్తున్నాం, స్వాగతిస్తున్నామన్నారు. అయన అభిప్రాయం అనుగుణంగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని, కొలిజియంలో మరింత పారదర్శకత అవసరం అందుకోసం జ్యుడిష్యల్ కమిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. E20 పెట్రోల్ వల్ల లాభాలు ఉన్నాయని, నష్ట్రాలంటూ ఉన్న అపోహలపై స్పష్టత త్వరలోనే ఇస్తామని అన్నారు. యూఏఈ కి చెందిన ఒక కంపెనీ త్వరలోనే ఇండియాలో కార్యక్రమం నిర్వహించి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తామని రఘునందన్ రావు తెలిపారు.
Also Read: అధ్యయనం.. పోరాటం.. జనం నాడి తెలుసుకునేందుకు దేశవ్యాప్త టూర్కు బొద్దింకల ప్లాన్.. !