E-Paper
Advertisement

Rahul and Revanth Travels in City Bus: సిటీ బస్సులో రాహుల్, రేవంత్, ప్రయాణికులతో మాటా మంతీ.. ఫ్రీ బస్సుపై ఆరా..!

Rahul and Revanth Travels in City Bus: సిటీ బస్సులో రాహుల్, రేవంత్, ప్రయాణికులతో మాటా మంతీ.. ఫ్రీ బస్సుపై ఆరా..!
Advertisement

Rahul Gandhi and CM Revanth Readdy Travels in Hyderabad City Bus: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి ప్రజలతో మమేకం అవుతున్నారు. సందర్భం ఏదైనా వారితో కాసేపు మాట్లాడి, వారి నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ, సరూర్‌నగర్ జన జాతర బహిరంగ సభ తర్వాత కాస్త రిలాక్స్ కోసం ప్రజల్లోకి వెళ్లిపోయారు.

గ్రేటర్ హైదరాబాద్‌లోని సిటీ బస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి కాసేపు ట్రావెల్ చేశారు. రష్‌గా ఉన్న బస్సులో ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై నేరుగా ప్రజల నుంచి వివరాలు కూడా తీసుకున్నారు. దాదాపు గంటకు పైగానే ట్రావెల్ చేశారు. ఈ సమయంలో ప్రయాణికులతో ముచ్చటించారు.

Advertisement

తెలంగాణ ఆర్టీసీలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళల నుంచి సమాచారం రాబట్టారు రాహుల్‌గాంధీ. ఇప్పటివరకు అమలు చేసిన పథకాల తీరు ఎలా ఉన్నాయని అడిగారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి ఆరా తీశారు. యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు వివరించారు అగ్రనేత. ఈ సందర్భంగా ప్రయాణికులు రాహుల్, రేవంత్ కలిసి ఫోటోలు దిగారు.

గతంలో భారత్ న్యాయ్ యాత్ర వేళ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చారు రాహుల్‌‌గాంధీ. రాత్రి వేళ ఓ రెస్టారెంట్‌కి వెళ్లి సందర్శకులతో ముచ్చటించారు. రాహుల్‌గాంధీని చూడగానే అక్కడికి వచ్చిన ప్రజలు చుట్టుముట్టారు. ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే పథకాల గురించి కూడా వివరించారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలతో రాహుల్ భేటీ అయిన సందర్భాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement

 

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×