E-Paper
Advertisement

MLA Raja Singh: సెక్యూరిటీ వదిలేసి రా.. ఐదు నిమిషాల్లో తాడోపేడో తేల్చుకుందాం.. అక్బరుద్దీన్ కు రాజాసింగ్ సవాల్

MLA Raja Singh: సెక్యూరిటీ వదిలేసి రా.. ఐదు నిమిషాల్లో తాడోపేడో తేల్చుకుందాం.. అక్బరుద్దీన్ కు రాజాసింగ్ సవాల్
Advertisement

MLA Raja Singh: వరంగల్‌లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో చేసిన వివాదాస్పద 15 నిమిషాల వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్బరుద్దీన్ 15 నిమిషాలు కాదు కదా.. 15 ఏళ్ల సమయం ఇచ్చినా ఏమీ చేయలేరంటూ ఎద్దేవా చేశారు. పదేపదే అదే డైలాగులు కొడుతూ కాలక్షేపం చేయడం మానుకోవాలని సూచించారు.

“నీలో నిజంగా దమ్ముంటే నీ సెక్యూరిటీ వదిలేయ్.. నేను కూడా నా సెక్యూరిటీని వదిలేస్తాను. 15 నిమిషాలు కాదు కేవలం ఐదు నిమిషాలు సమయం ఇవ్వు.. ఆ ఐదు నిమిషాల్లో మేమేంటో నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను” అంటూ రాజాసింగ్ అక్బరుద్దీన్ ఒవైసీకి బహిరంగ సవాల్ విసిరారు. డేట్, టైమ్, ప్లేస్ అన్నీ నువ్వే డిసైడ్ చేయ్.. నీ అడ్డాకి రావాలా.. నీ గడ్డాకి రావాలా.. లేక నీ ఇంటికే రావాలా చెప్పు.. ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తనకు కత్తులు, గన్లు ఏవీ వద్దని.. కేవలం తన చేతులతోనే నిన్ను చంపేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని.. దానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటూ హెచ్చరించారు. ఓవైసీ సోదరుల రాజకీయాలు పాతబస్తీ దాటి బయటకు రావడం లేదని విమర్శించారు. రాజాసింగ్ మాటలు సభకు వచ్చిన యువతలో తీవ్ర ఉద్వేగాన్ని నింపాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Read Also: Harish Rao: అది యూరియా యాప్ కాదు.. రైతులకు ఉరితాడు, రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు విమర్శలు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×