E-Paper
Advertisement

Felicitated: అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సింఘ్వీ

Felicitated: అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సింఘ్వీ
Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: బేగంపేట్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ లీగల్ సెల్ సన్మానించింది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ టీం సభ్యులు హాజరయ్యారు. సన్మానం అనంతరం మాట్లాడిన సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం న్యాయవాదులు అధికారం ఎటు ఉంటే అటు వెళ్తున్నారని మండిపడ్డారు. లీగల్ హెడ్ కార్యక్రమాలు తరుచూ మనం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Also Read: థాంక్యూ.. సీఎం సార్: బీసీ సంఘాల నేతలు

Advertisement

ఇక, కవిత అరెస్ట్‌పై స్పందించిన ఆయన, కేజ్రీవాల్ కేసు, కవిత కేసు వేరని అన్నారు. విచారణ పూర్తి చేసాకే మహిళగా కవితను అరెస్ట్ చేశారని, న్యాయవ్యవస్థ ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. టీపీసీసీ లీగల్ సెల్ క్షేత్ర స్థాయిలో విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు మన లీగల్ సెల్ తరఫు నుంచి భరోసా కల్పించాలని, హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జలాల్లో కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ, న్యాయవాదుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. టీపీసీసీ లీగల్ సెల్‌కి టీపీసీసీ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్, ఇండ్ల స్థలాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హైకోర్టు కొత్త భవనాన్ని సకాలంలో పూర్తి చేసేలా కృషి చేస్తామని తెలిపారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×