E-Paper
Advertisement

TRS: అర్వింద్, షర్మిల.. దాడులతో టీఆర్ఎస్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

TRS: అర్వింద్, షర్మిల.. దాడులతో టీఆర్ఎస్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
Advertisement

TRS: టీఆర్ఎస్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోందా? లేదంటే, అంతా కావాలనే చేస్తున్నారా? నేతల్లో కోపం కట్టలు తెంచుకుంటోందా? దాడులతో బెదిరించాలని చూస్తున్నారా? మరి ఎందుకు గులాబీ శ్రేణులు అదుపు తప్పుతున్నారు? వరుస దాడులతో తమ అసహనాన్ని ఎందుకు బయటపెట్టుకుంటున్నారు? మునుగోడులో గెలిచినా ఊరట లభించలేదా? ఫాంహౌజ్ కేసులో పట్టు చిక్కినా సరిపోదనుకుంటున్నారా? మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు కలవరపెడుతున్నాయా? బీజేపీ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారా? ఇలా.. టీఆర్ఎస్ పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

అప్పట్లో తెలంగాణ ఉద్యమం ప్రశాంతంగా సాగింది. ఎంతటి భావోద్వేగం ఉన్నా.. ఎక్కడా అదుపు తప్పలేదు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఉద్యమకారులు మాత్రం శాంతియుతంగానే పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధించారు. గడిచిన ఎనిమిదేళ్లలోనూ అంతా ప్రశాంతతే. ఎక్కడా ఎలాంటి రాజకీయ దాడులు జరిగిన దాఖలాలు లేవు. కానీ, ఇటీవల కారు పార్టీ నేతలు పెడదారి పడుతున్నట్టుంది. వరుస దాడులతో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుంది.

Advertisement

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై కవిత అనుచరులు సడెన్ గా దాడి చేశారు. రాళ్లు, కర్రలతో ఇంటిని ధ్వంసం చేశారు. కవిత సైతం కొడతా, చంపుతా.. అంటూ బెదిరించారు. టీఆర్ఎస్ శ్రేణులు అంతలా రెచ్చిపోవడానికి అర్విందేమీ అనరాని మాటలు అనలేదని అంటున్నారు. కవిత కాంగ్రెస్ లోకి వెళతారంటేనే ఇంతటి విధ్వంసమా? అని ఆశ్చర్యపోయారు. అంతకుముందు రెండుసార్లు ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద కూడా దాడి జరిగింది. అర్వింద్ వర్సెస్ కవిత కాబట్టి వారికేదో నిజామాబాద్ పగలు, ప్రతీకారాలు ఉన్నాయని అనుకోవచ్చు.. కానీ, షర్మిల మీద దాడులెందుకు?

తన మానాన తాను పాదయాత్ర చేసుకుంటుంటే.. ఎండా వానా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్తుంటే.. ఇన్నాళ్లూ వదిలేసినట్టే వదిలేయొచ్చుగా? సడెన్ గా ఆమె ఫ్లెక్సీలు, బస్సు తగలబెట్టడం ఎందుకు? షర్మిల పాదయాత్రపై దాడి చేసి, తిరిగి ఆమెనే అరెస్టు చేసి హైదరాబాద్ తరలించడం ఎందుకు? గులాబీ నేతల్లో ఇంతటి ఫ్రస్టేషన్ ఎందుకు? అంటున్నారు.

Advertisement

కేంద్రం టార్గెట్ చేస్తోంది.. ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి.. బీజేపీ దూకుడు మీదుంది.. ఇలా ముప్పేట దాడితో గులాబీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు. అందుకే, అలా దాడులకు తెగబడుతున్నారని చెబుతున్నారు. ఎంపీ అర్వింత్ ఇంటిపై దాడి జరిగినప్పుడే బీజేపీ హెచ్చరించింది.. మా కార్యకర్తలు తిరగబడితే మీరు ఉంటారా? అని బెదిరించింది. బీజేపీ నేతలపై దాడి చేయడమంటే ఏదో రాజకీయ అసహనం అనుకోవచ్చు. మరి, ఇప్పటి వరకూ ఏ ఉప ఎన్నికలోనూ పోటీ చేయని.. ఒక్కరంటే ఒక్క బలమైన నేత కూడా లేని.. షర్మిలపై ఇంతటి పోలీస్ యాక్షన్ ఎందుకు? ఉనికి లేని పార్టీయేగా.. ఏమవుతుందిలే అనుకున్నారా? కానీ, తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోందనే సంగతి మరిచారా? ప్రతిపక్షాలన్నీ తమ స్టైల్ లో రాజకీయం చేసుకుపోతుంటే.. పొలిటికల్ గానే వారికి బదులివ్వాలి గానీ.. అర్వింద్ ఇంటిపై దాడి, షర్మిల పాదయాత్రపై అటాక్ లాంటి విపరీత చర్యలతో అధికార పార్టీ ఎందుకు దిగజారుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. వైఫల్యాలు భయపెడుతున్నాయా? దాడులతో నోరు మూయించాలనే ప్రయత్నమా?

Related News

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త రూల్స్.. కేంద్రం కొత్త పోర్టల్.. ఇలా అప్లై చేయండి?

జీహెచ్‌ఎంసీలో డబుల్ బిల్లుల భారీ కుంభకోణం.. రూ. 70 కోట్ల నిధులు దారిమళ్లింపు!

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఏఐసీసీ సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×