Lee Kuan Yew:సింగపూర్లో లీ క్వాన్ యూను జాతిపితగా కీర్తిస్తారు. అంటే కేసీఆర్ను కూడా తెలంగాణ జాతిపితగా పిలవాలనే తన ఆకాంక్షను ఇలా మరోసారి గుర్తు చేశాడన్నమాట కేటీఆర్. అంతే కాదు.. సింగాపూర్ను లీ .. ప్రపంచ పటంలో పెట్టినట్టుగానే తెలంగాణను కూడా కేసీఆర్ తన పాలన ద్వారా ప్రపంచంలోనే నెంబర్గా నిలిపాడని గుర్తు చేశారు ఈ సందర్భంగా. అసలు ఈ లీక్వాన్ యూ ఎవరు..? ఆయన నేపథ్యం.. ? లభించిన ప్రత్యేక గుర్తింపు ఏమిటీ? అనే చర్చ ఇప్పుడు కొనసాగుతోంది.
లీ క్వాన్ యూను ఆధునిక సింగపూర్ పితామహుడు గా పిలుస్తారు. 1959 నుండి 1990 వరకు సుమారు 31 సంవత్సరాల పాటు సింగపూర్ తొలి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1965లో మలేషియా నుండి విడిపోయినప్పుడు సింగపూర్లో నిరుద్యోగం, పేదరికం ఎక్కువగా ఉండేవి. అలాంటి దేశాన్ని కేవలం ఒకే ఒక్క తరంలో ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఆయన మార్చారాయన. సింగాపూర్లో అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేసి, అవినీతిని పూర్తిగా నిర్మూలించగలిగారని చెబుతారు. ఈ కారణంగా.. సింగపూర్ ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలు లీ క్వాన్ యూను దేవుడిలా భావిస్తారు.
ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆయన కోసం ప్రత్యేకంగా ‘సీనియర్ మినిస్టర్’, ఆ తర్వాత ‘మినిస్టర్ మెంటర్’ పదవులను సృష్టించి 2011 వరకు ప్రభుత్వంలో కొనసాగించారు. లీ క్వాన్ యూ చిత్రపటాన్ని అధికారికంగా గౌరవిస్తారక్కడ. ఆయన మార్చి 23, 2015న మరణించారు.
ALSO READ:రివర్స్ అటాక్.. కొండా అవుట్..!
అప్పుడు వారం రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. కేటీఆర్ అన్నట్టుగానే .. చాలా సార్లు… కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాల్లో తనను మహాత్మాగాంధీతో పోల్చుకునేవారట. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ ఫోటోలతో సమానంగా తన ఫోటోను కూడా తెలంగాణలో పెట్టుకోవాలని, కానీ రాజకీయాల్లో ఇంకా ఉన్నందుకు .. అందరితో తిట్లు పడుతున్నానని కూడా చెప్పుకుని బాధపడేవారట.