E-Paper
Advertisement

Hyderabad City: హైదరాబాద్ సిటీ ఇకపై నాలుగు కార్పొరేషన్లు, రేవంత్ సర్కార్ ప్లాన్

Hyderabad City: హైదరాబాద్ సిటీ ఇకపై నాలుగు కార్పొరేషన్లు, రేవంత్ సర్కార్ ప్లాన్
Advertisement

Hyderabad City: దేశంలోని నగరాల్లో జనాభా ఏడాదికేడాది క్రమంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా మౌళిక సదుపాయాల కొరత ఏర్పడుతోంది.  ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో సిటీని నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు లేకపోలేదు.

దీంతో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. కబ్జాలు, ఆక్రమణలు విచ్చల విడిగా పెరిగిపోయాయి. పరిస్థితి గమనించిన తెలంగాణ సర్కార్ హైదరాబాద్ సిటీపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది. దీంతో మౌలిక సదుపాయాలపై ఫోకస్ చేసింది.

Advertisement

2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ సిటీ జనాభా 76 లక్షల పైమాటే. గడిచిన 15 ఏళ్లలో జనాభా దాదాపు కోటిన్నర చేరినట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం ఓఆర్ఆర్ పరిధిలో ఉంటున్నారు. మరో నాలుగేళ్లలో 50 శాతానికి చేరుకోవచ్చన్నది ఓ అంచనా.

ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న ఏడు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధి కూడా పెరిగింది.  జీహెచ్‌ఎంసీ శివార్లలో మంచి నీరు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. కట్టడాలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి.

Advertisement

ALSO READ: హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036: సీఎం రేవంత్

దీన్ని గమనించిన రేవంత్ సర్కార్, బడ్జెట్‌లో 10 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తూ పోతోంది. హైడ్రా విస్తరణ, మూసీ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ సిటీలో లేక్‌లపై చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది.

లేటెస్ట్‌గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను నాలుగు కార్పొరేషన్లుగా విభజించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.  ఈ లెక్కన కసరత్తు జరుగుతోందన్న మాట.

శుక్రవారం మాదాపూర్‌లో అసోచాం ఆధ్వర్యంలో జరిగిన అర్భన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమిత్‌లో ఈ వ్యాఖ్యలు చేశారాయన. హైదరాబాద్ దశ-దిశ మార్చాలన్నదే రేవంత్ సర్కార్ ఆలోచన తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కార్పొరేషన్ల అంశం ఓ కొలిక్కి రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఒక రూపు రావచ్చని చెబుతున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×