E-Paper
Advertisement

Revanth Reddy: రాజీనామాకు సిద్ధం.. బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాజీనామాకు సిద్ధం.. బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటువేయడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టి.కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరుపున చేసే పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ గొంతు నొక్కి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కుట్రలను తిప్పి కొడుతామని స్పష్టం చేశారు. బీజేపీకి సరైన బుద్ధి చెబుతామన్నారు. కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదన్నారు. అందుకే దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏఐసీసీ చెప్పినట్లుగా నడుచుకుంటామని వెల్లడించారు.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×