E-Paper
Advertisement

Revanthreddy : కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి డేటా ఎత్తుకెళ్లారు.. డీజీపీ పోస్టు కోసమేనా ? : రేవంత్

Revanthreddy : కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి డేటా ఎత్తుకెళ్లారు.. డీజీపీ పోస్టు కోసమేనా ? : రేవంత్
Advertisement

Revanthreddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. కాంగ్రెస్ వార్ రూంపై దాడి చేసింది పోలీసులు కాదు గుండాలని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ డేటా అంతా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తన పాదయాత్ర కోసం , కర్నాటక ఎన్నికల కోసం తయారు చేసిన కార్యాచరణను ఎత్తుకెళ్లారని తెలిపారు. ఇతర పార్టీ నేతలపై వార్ రూమ్ నుంచే పోస్టింగ్ చేశారని ఫ్రూప్ ఉందా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని సీపీ సీవీ ఆనంద్ ఎలా చెప్తారు? అని నిలదీశారు. ఉత్తమ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మా నేతలు, నిపుణులపై పోలీసుల దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. సీఎంను మెప్పించాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పని చేస్తున్నారని ఆరోపించారు. ఇలా డీజీపీ పదవి పొందాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు.

కార్యాచరణ ఇదే..!
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో భారత్ జోడో యాత్రపై చర్చించామని తెలిపారు. తీర్మానాలు ఆమెదించుకున్నామన్నారు. హైకమాండ్ ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహించామన్నారు. ప్రాణహాని ఉందని హెచ్చరికలు ఉన్నా లెక్కచేయకుండా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జనవరి 3, 4 తేదీల్లో పార్టీ శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. అన్ని జిల్లాలకు ఇన్ ఛార్జ్ ల నియామకం చేపడతామన్నారు. హైకమాండ్ ఆదేశాలతో జనవరి 26 నుంచి పాదయాత్ర చేపడుతున్నానని రేవంత్ ప్రకటించారు.

Advertisement

ప్రజా సమస్యలపై పోరాటం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీకి 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ వెళ్లాలే కార్యక్రమాలు చేపడతామన్నారు. పోడు భూముల సమస్యలపై పోరాడతామన్నారు. ఓటరు జాబితాలో అవకతవకలపై నిలదీస్తామన్నారు. మోదీ, కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ రూపొందిస్తామన్నారు. సోషల్ మీడియా సాయంతో కేడర్ కు చేరువ అవుతామని తెలిపారు. బీఆర్ఎస్ ను గద్దె దించి ప్రజలు జీవితాల్లో మార్పు తెస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×